Don't Miss!
- News అభ్యర్దుల మార్పు పై చంద్రబాబు కీలక నిర్ణయం - ఆ నేతలకు పిలుపు..!!
- Sports అందుకే ధోనీ ముందుగా బ్యాటింగ్కు రావట్లేదు- CSK కోచ్
- Finance IREDA: భారీగా లాభాలను ప్రకటించిన ఐఆర్ఈడీఏ..
- Automobiles మరింత తక్కువ ధరలో బజాజ్ చేతక్ ఇ స్కూటర్.. త్వరలో లాంచ్.!!
- Technology Dell నుంచి నాలుగు కొత్త Ai ల్యాప్టాప్లు! ధర,స్పెసిఫికేషన్లు
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
ఇంటికెళ్లిన ఛార్మీకి అదిరిపోయే షాకిచ్చిన యంగ్ హీరోయిన్.. మరీ ఇంత దారుణంగానా.!
Recommended Video
'ఇస్మార్ట్ శంకర్' హిట్తో ఊపుమీదున్న పూరీ జగన్నాథ్ - 'డియర్ కామ్రేడ్' ఫలితంతో ఢీలా పడిన విజయ్ దేవరకొండ కలిసి సినిమా చేస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. క్రేజీ కాంబినేషన్ కావడంతో ఈ సినిమాపై అప్పుడే ఊహాగానాలు, అంచనాలు ప్రారంభమయ్యాయి. అలాగే, ఎన్నో ఆసక్తికరమైన అంశాలు కూడా తెరపైకి వస్తున్నాయి. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ వార్త ఫిలింనగర్లో హల్చల్ చేస్తోంది. అదే.. ఈ సినిమా కోసం ఓ హీరోయిన్ నిర్మాతలకు షాకిచ్చిందట. ఇంతకీ ఆమె ఎవరు.? పూర్తి వివరాల్లోకి వెళితే..
మాస్ మసాలా కథ
విజయ్ దేవరకొండతో చేయబోయే సినిమా కోసం పూరీ జగన్నాథ్ పక్కా మాస్ మసాలా కథను రెడీ చేసినట్లు తెలుస్తోంది. తన గత చిత్రం ‘ఇస్మార్ట్ శంకర్' హిట్ తర్వాత ఇకపై మాస్ సినిమాలే చేస్తానని ఆయన ప్రకటించిన విషయం తెలిసిందే. అందుకు అనుగుణంగానే మరో మాస్ స్టోరీని సిద్ధం చేసేసినట్లు ప్రచారం జరుగుతోంది. ఇందుకు అనుగుణంగానే విజయ్ తన బాడీ లాగ్వేజ్ మార్చుకోబోతున్నాడని గుసగుసలు వినిపిస్తున్నాయి.
సొంత బ్యానర్పైనే
త్వరలో పట్టాలెక్కబోతున్న ఈ సినిమాను పూరీ తన సొంత బ్యానర్లో చేయనున్నాడు. పూరి జగన్నాథ్ టూరింగ్ టాకీస్, పూరి కనెక్ట్స్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నాయి. పూరి, ఛార్మి నిర్మాతలు. ప్రొడక్షన్ బాధ్యతలు ఛార్మీ దగ్గరుండి చూసుకోనుంది. ఈ చిత్రాన్ని లావణ్య సమర్పిస్తున్నారు. ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలోనే ప్రకటించనున్నట్టు చిత్ర యూనిట్ తెలిపిన విషయం తెలిసిందే.
జాన్వీ కపూర్ను అనుకున్నారు
పూరీ జగన్నాథ్ - విజయ్ దేవరకొండ సినిమాలో ఎవరూ ఊహించని ఓ హీరోయిన్ను నటింపజేస్తున్నారని ప్రచారం జరుగుతోంది. ఆమె మరెవరో కాదు.. అలనాటి అందాల తార శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్. అందంలో తల్లికి ఏమాత్రం తీసిపోనంతగా ఉండే ఈ అమ్మడు.. తొలి సినిమాలోనే నటనతో మెప్పించి విమర్శకుల ప్రసంశలు అందుకుంది. ఈ ఊపులోనే మరికొన్నిసినిమాలకూ సంతకాలు చేసేసింది. అన్ని భాషల్లో నటించేందుకు సిద్ధమవుతున్న క్రమంలోనే ఈ సినిమాలో నటిస్తుందని అన్నారు.
ఛార్మీకి షాకిచ్చేసిందట
ఈ సినిమాలో నటించే విషయంలో నిర్మాతల్లో ఒకరైన ఛార్మీ.. ముంబై వెళ్లి మరీ జాన్వీ కపూర్తో మంతనాలు జరిపిందని తెలుస్తోంది. ముందు ఈ సినిమాలో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిన ఈ యంగ్ హీరోయిన్.. అందుకోసం రూ. 4 కోట్లు డిమాండ్ చేసిందని ప్రచారం జరుగుతోంది. జాన్వీ చెప్పిన అమౌంట్కు ఛార్మీ దిమ్మతిరిగిపోయిందని అంటున్నారు. ఇక, చేసేదేం లేక ఆమె అక్కడి నుంచి వచ్చేసిందని ఫిలింనగర్లో ఓ వార్త చక్కర్లు కొడుతోంది.
ప్రస్తుతం ఆమె చేస్తున్న చిత్రాలు
ప్రస్తుతం జాన్వీ కపూర్ ‘రూహీ అఫ్జా' అనే సినిమా చేస్తోంది. హార్ధిక్ మెహతా దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను దినేష్ విజన్, లంబా నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో రాజ్కుమార్ రావు లీడ్ రోల్ చేస్తుండగా, వరుణ్ శర్మ, రోహిత్ రాయ్, పంకజ్ త్రిపాఠి తదితరులు నటిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాను 2020 మార్చిలో విడుదల చేయడానికి చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తోంది. అలాగే, ‘దోస్తానా 2' సినిమాలోనూ చేస్తోంది.