Don't Miss!
- Sports హార్దిక్పై కోపంగా మలింగ.. కారణమదేనా? Video
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
- News బీజేపీకి అనపర్తి సీటు కేటాయింపు వెనుక వైసీపీ..!?
- Lifestyle నోరూరించే పచ్చి మామిడికాయ గొజ్జు మామిడికాయ కర్రీ వేడివేడి అన్నంతో తింటుంటే ఆహా అనాల్సిందే..
- Finance Rain Tax: ఆ నగరంలో ప్రజలపై వర్షం టాక్స్..! ఏప్రిల్ నుంచి దబిడిదిబిడేనా..??
- Technology ఆపిల్ వరల్డ్ వైడ్ డెవలపర్ కాన్ఫరెన్స్ 2024 తేదీ వెల్లడి.. iOS 18, GenAI పై కీలక ప్రకటనలకు అవకాశం..!
- Automobiles బుల్లితెర నటి 'ప్రజ్ఞా భట్' కొత్త కారు చూసారా.. ధర ఎంతో తెలుసా?
పవన్ టూరు గురించి మహేష్ బావ లీక్
హైదరాబాద్: పవన్ కల్యాణ్ ఇండియాలో లేరా... అందుకే ప్రధాని మోడీ ప్రమాణ స్వీకారానికి హాజరు కాలేదా అనే సందేహాలు చాలా మందిలో కలుగుతున్నాయి. మోడీ నుంచి ఆహ్వానం రాలేదని ఓ ప్రక్కన వినపడుతున్న నేపధ్యంలో అసలు ఆయన ఇండియాలో లేరు ప్యారిస్ వెళ్లారంటూ ఓ వార్త మొదలైంది. మహేష్ బాబు బావ గల్లా జయదేవ్ ఈ విషయాన్ని ఫేస్ బుక్ ద్వారా ప్రపంచానికి తెలియచేసాడంటున్నారు. నిజమెంతో కానీ ఈ వార్త మాత్రం మీడియాలో వేగంగా ప్రయాణం చేస్తోంది. మరి పవన్ ఇలా ప్యారిస్ వెళ్లిపోతే ..ఓ మైగాడ్,గబ్బర్ సింగ్ 2 సంగతేంటి అనేది తెలియాలి.
ఇక 'ఓ మై గాడ్' రీమేక్ చిత్రం జూన్2న ఈ చిత్రం ప్రారంభం కాబోతోంది. ఆ వెంటనే చిత్రీకరణ మొదలవుతుంది. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించి హైదరాబాద్లో ఓ సెట్ని తీర్చిదిద్దుతున్నారు. అందులోనే కీలక సన్నివేశాలు తెరకెక్కిస్తారని తెలుస్తోంది. డాలీ దర్శకత్వం వహిస్తారని సమాచారం. ప్రస్తుతం హీరోయిన్ ఎంపిక గురించి చిత్రబృందం కసరత్తులు చేస్తోంది. 'ఓ మై గాడ్'లో అక్షయ్కుమార్, పరేష్ రావల్ నటించారు. ఈ మేరకు ఏర్పాట్లు మెగా స్పీడుతో జరుగుతున్నాయి. 'దేవ దేవం భజే' అనే టైటిల్ ని పవన్ ఓకే చేయటంతో ఖరారు చేసినట్లు సమాచారం. పవన్ సూపర్ హిట్ అత్తారింటికి దారేది చిత్రంలో 'దేవ దేవం భజే' ట్రాక్ ఉంది. అప్పట్లో ఎమ్.ఎస్ సుబ్బలక్ష్మి గానం చేసిన ఈ ట్రాక్ చాలా పాపులర్. దేవుడికి,భక్తుడికి చెందిన చిత్రం కాబట్టి ఈ టైటిల్ సూటయ్యే అవకాసం ఉందని భావిస్తున్నారు.
అలాగే బాలీవుడ్ చిత్రాన్ని చాలా మార్చి తెలుగు నేటివిటికి తగినట్లు చేస్తున్నారు. అందులో భాగంగా ఒరిజనల్ లో ఉన్న పరేష్ రావెల్ పాత్ర కు ఇద్దరు పిల్లలు ఉంటే..ఇక్కడ వెంకటేష్ కి ఇద్దరు చెల్లెళ్లు ఉండేలా మార్చారని తెలుస్తోంది. అలాగే పవన్ కళ్యాణ్ గెటప్ సైతం పూర్తి మార్పుతో ఉంటుందని,దానిపై కసరత్తు జరిగిందని చెప్తున్నారు. మొదట వెంకటేష్ తో షూటింగ్ మొదలు పెట్టి తర్వాత పవన్ తో ఫినిష్ చేస్తారు. ఈ మేరకు ప్రత్యేకమైన వీధి సెట్ ని వేసారు.
పవన్ కల్యాణ్, వెంకటేష్ కలిసి నటిస్తారనే ప్రచారం ఎప్పటి నుంచో జరుగుతోంది. అది ఇప్పటికి కుదిరింది. బాలీవుడ్లో ఘన విజయం సాధించిన చిత్రం 'ఓ మై గాడ్'. 'మేన్ హూ స్యూడ్ గాడ్' అనే ఆంగ్ల చిత్రం ఆధారంగా తెరకెక్కిన చిత్రమిది. ఈ రెండు చిత్రాల్ని స్ఫూర్తిగా తీసుకొని.. సురేష్ ప్రొడక్షన్స్ సంస్థ తెలుగులో ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఈ సినిమాని తెరకెక్కించనున్నారు. ఇందులో బాలీవుడ్ లో అక్షయ్ కుమార్ చేసిన శ్రీ కృష్ణుని పాత్రలో పవన్ కళ్యాణ్, పరేష్ రావల్ చేసిన ఓ సాధారణ వ్యాపారి పాత్రలో వెంకటేష్ కనిపించనున్నారు. డాలీ ఈ చిత్రం డైరక్ట్ చేస్తారు.
కృష్ణుడు పాత్రకు ఎక్కువ సీన్స్ ఉండవు కాబట్టి గబ్బర్ సింగ్ 2 తో పాటు ఈ చిత్రమూ చేస్తాడని చెప్తున్నారు. వెంకటేష్ స్వయంగా పవన్ ని అడిగాడని అందుకే పవన్ కళ్యాణ్ గ్రీన్ సిగ్నల్ ఇఛ్చాడని అంటున్నారు. పరేష్ రావల్ ప్రధాన పాత్రలో నటిస్తూ నిర్మించిన చిత్రం 'ఓ మై గాడ్'. అక్షయ్ కుమార్ కూడా ఓ కీలక పాత్రలో నటించి నిర్మాణంలో భాగస్వామిగా వ్యవహరించారు. ఉమేష్ శుక్లా దర్శకత్వం వహించారు. 'కంజి విరుద్ధ్ కంజి' నాటకం ఈ చిత్రానికి ఆధారం.
'ఓ మై గాడ్'కథ ఏమిటంటే... పరేష్ రావెల్ ఓ నాస్తికుడు. అతనికి యాంటిక్స్ షాప్ ఉంటుంది. ఓరోజు అతని వ్యాపారం భూకంపం దెబ్బకు నాశనమైపోతుంది. దాంతో అతను ఇన్సూరెన్స్ వారిని ఆశ్రయిస్తారు. అయితే వాళ్లు చేతులెత్తేసి... అది భగవంతుడు పని కాబట్టి తమకేం సభందం లేదని చెప్తారు. దాంతో కోపం తెచ్చుకున్న అతను భగవంతుడుపై కేసు వేస్తాడు. అప్పుడు భగవంతుడు వచ్చి ఏం చేస్తాడు అనేది మిగతా కథ.