ఆమెని షాక్ చేసిన బాలకృష్ణ
తన నటనతో బాలకృష్ణ రీసెంట్ గా సహజనటి జయసుధనే షాక్ చేసారట. ఇది 'అధినాయకుడు" షూటింగ్ లో జరిగిందని చెప్తున్నారు. ఆ చిత్రంలో బాలకృష్ణ మూడు గెటప్ లలో కనపిస్తారు. తాతగా కనిపించే గెటప్ కు భార్యగా జయసుధ చేస్తోంది. ఆమె ఈ ముగ్గురుని ఒకేసారి కలిసే సీన్ లో ఆమె కనిపిస్తుందిట. అప్పుడు ముగ్గురుగా విభిన్నంగా బాలకృష్ణ ఇచ్చిన ఎక్సప్రెషన్స్ కు ఆమెకు చాలా ఆశ్చర్యం వేసిందని సమాచారం. ఏ పాత్రకు ఆ పాత్ర విభిన్నంగా చూపుతూ పరిణితి చెందిన నటనతో బాలకృష్ణ చాలా బాగా చేసారుట.
ఇక ఈ విషయమై జయసుధ మాట్లాడుతూ..'అధినాయకుడు" సినిమాలో తొలిసారి బాలకృష్ణగారికి పెయిర్గా నటించా. ఆయన సరసన ఎప్పుడో నటించాల్సింది. 'అన్నదమ్ముల అనుబంధం"లో జయమాలిని చేసిన కేరక్టర్కి ముందు నన్నే అడిగారు. కానీ అప్పుడు డేట్స్ సర్దుబాటు చేయలేకపోయాను. ఆ తర్వాత 'శివరంజని"లో ముందు బాలకృష్ణనే హీరోగా అనుకున్నారు దాసరి గారు. కానీ కొన్ని కారణాల వల్ల అది కుదర్లేదు. ఫైనల్గా ఈ సినిమాలో ఆయన సరసన చేస్తున్నాను. ఇందులో బాలకృష్ణ తాతగా, తండ్రిగా, కొడుగ్గా త్రిపాత్రాభినయం చేస్తున్నారు. తాత పాత్రకు నేను జోడీ అన్నమాట అంటున్నారు జయసుధ.
'అధినాయకుడు" చిత్రాన్ని కీర్తి కంబైన్స్ పతాకంపై ఎమ్మెల్ కుమార్ చౌదరి నిర్మిస్తు న్నారు. ఈ చిత్రంలో లక్ష్మీరాయ్, చార్మి, సలోని హీరోయిన్లుగా నటిస్తున్నారు. కళ్యాణి మాలిక్ కంపోజ్ చేసిన అన్ని పాటలు చాలా అద్భుతంగా వచ్చా యని అంటున్నారు. ఈ నెలలోనే్ చిత్రం ఆడియో విడుదల కాబోతుందని వినికిడి.శ్రీరామ రాజ్యం వంటి భక్తి రసాత్మక చిత్రం తర్వాత ఔట్ అండ్ ఔట్ కమర్షియల్ మూవీగా 'అధినాయకుడు"రాబోతోంది.


Click it and Unblock the Notifications











