Don't Miss!
- Sports చరిత్ర సృష్టించిన అక్షర్ & పంత్ క్రేజీ రికార్డు
- Lifestyle చింత చిగురు పప్పు: నోట్లో నీళ్ళు ఊరాల్సిందే.. వాసనకు కడుపు నిండాల్సిందే..
- Automobiles 2024 Jeep Wrangler Facelift Review జీప్ రాంగ్లర్ ఫేస్లిఫ్ట్ ఆఫ్రోడర్ పర్ఫామెన్స్ ఫుల్ రివ్యూ
- News జగన్ కు వైఎస్ వివేకా భార్య లేఖ-అవినాష్, వైసీపీ అటాక్ పై-న్యాయంవైపు నిలబడాలని విన్నపం..!
- Finance Kotak Mahindra Bank: కొంపముంచిన కోటక్ మహీంద్రా బ్యాంక్.. భారీగా పడిపోయిన స్టాక్..!
- Technology ఆపిల్ తరహా డిజైన్తో నాయిస్ స్మార్ట్వాచ్.. 1.85 అంగుళాల డిస్ప్లే, 7 రోజుల బ్యాటరీ లైఫ్తో విడుదల
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
చిరంజీవి ‘బ్లడ్ బ్యాంక్’కి ఎసరు పెట్టనున్న జీవిత రాజశేఖర్...
అదే పనిగా టీవీల్లో కనపడిన ఆరోపణలు చేస్తుండేసరికి రాజశేఖర్ దంపతులపై చిరంజీవి పరువు నష్టం కేసు పెట్టించారు. డైరెక్ట్ ఎటాక్ చేస్తే తమపైనే రివర్స్ ఎటాక్ జరుగుతుందని భయపడి రాజశేఖర్, జీవిత ఇప్పుడు చిరంజీవి ఊసెత్తడం మానేశారు. ఇప్పటికే పీకల్లోతు అప్పుల్లో ఉన్న తమకి కొత్తగా చిరంజీవి పరువుకి ఖరీదు కట్టే స్తోమత లేకపోవడంతో సైలెంటయ్యారు. అయితే చిరంజీవి అన్నా, చిరంజీవి బ్లడ్ బ్యాంక్ అన్నా తమకి చాలా ఇష్టం కాబట్టి దాని గురించి తమకి తెలిసిన నిజాలు ప్రజలకి చేరవేయడానికి వారు కొత్త మార్గం వెతుక్కున్నారు.
త్వరలో 'బ్లడ్ బ్యాంక్" పేరుతో రాజశేఖర్ ఒక చిత్రాన్ని రూపొందించడానికి సన్నాహాలు చేసుకుంటున్నాడు. ఈ చిత్రంలో చిరంజీవి బ్లడ్ బ్యాంక్ ని కమర్షియలైజ్ చేసి ఎలా పేదల రక్తంతో వ్యాపారం చేస్తున్నారనేది విపులంగా చూపించనున్నారు. ఈ చిత్రానికి ఫండ్ అంతా కూడా ఇటీవలే ఒక పెద్ద పార్టీ నుంచి వేరుపడి కొత్త కుంపటి పెట్టుకున్న ఓ యువనేత పెడుతున్నట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి.