Don't Miss!
- News మావోయిస్టులకు భారీ షాక్: గడ్చిరోలి ఎన్కౌంటర్లో నలుగురు మావోయిస్ట్ అగ్రనేతలు హతం!!
- Finance Adani News: చిక్కుల్లో గౌతమ్ అదానీ.. అదానీ గ్రూప్పై అమెరికా న్యాయ శాఖ దర్యాప్తు..!!
- Sports PSL Final: ఉత్కంఠ పోరులో ఆఖరి బంతికి విజయం Video
- Automobiles కదిలే ఇంద్రభవనమా? ఏంటిది మరి!.. వీడియో చూడాల్సిందే
- Technology ఆకట్టుకొనే డిజైన్, AI ట్రిపుల్ కెమెరా, 6.7 డిస్ప్లేతో మోటోరోలా స్మార్ట్ఫోన్.. విడుదల, సేల్ వివరాలు..!!
- Lifestyle ఈపాప చూడటానికి చాలా అందంగా ఉంది, కానీ ఓ వింత రోగం తినరానివి తింటుంది! నా కూతుర్ని రక్షించండి!!
- Travel హోలీ సందర్భంగా దేశంలోని ఈ ప్రదేశాలను చుట్టేయండి..!
RRR అప్డేట్.. జానపదాలకు ఎన్టీఆర్, రామ్ చరణ్ స్టెప్పులు.. థియేటర్లో విజిల్సే..
యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్లదో దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న భారీ మల్టీ స్టారర్ ఆర్ఆర్ఆర్పై ఎంతటి అంచనాలున్నాయో అందరికీ తెలిసిందే. ఈ ప్రతిష్టాత్మకమైన చిత్రం నుంచి ఏ చిన్న అప్డేట్ వస్తుందా? అని అటు నందమూరి ఫ్యాన్స్, ఇటు మెగాభిమానులు వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు.
ప్రధానంగా సాగే కీరవాణి సంగీతం
రాజమౌళి సినిమా అంటే కీరవాణి సంగీతం ఉండాల్సిందే. నటులతో రాజమౌళి ఎంతగా భావోద్వేగాలను పండించేలా చేస్తాడో.. కీరవాణి తన నేపథ్య సంగీతంతో వాటిని అంతకుమించి ఎలివేట్ చేస్తాడు. అలా కీరవాణి-రాజమౌళి చేసే మ్యాజిక్ ఈ చిత్రంలోనూ ఉండబోతోందని సమాచారం.
ఏడు పాటలతో కనువిందు..
1920 నాటి పరిస్థితుల నేపథ్యంలో తెరకెక్కుతున్న చారిత్రక సినిమా కావడంతో ఈ సినిమాలో ఎన్టీఆర్, రామ్ చరణ్ డాన్సులు మిస్ అవుతామేమో అని భావించారు వారి ఫ్యాన్స్. కానీ మెగా, నందమూరి అభిమానులకు కనువిందు చేసేలా ఏడు పాటలు, హోరెత్తిపోయే డాన్సులు రూపొందిస్తున్నారట జక్కన్న.
జానపదాలకు.. ఎన్టీఆర్, రామ్ చరణ్ స్టెప్పులు
ఈ సినిమా లో చరణ్.. ఎన్టీఆర్ పై రాజమౌళి పాటను ప్లాన్ చేస్తున్నారట. ఈ పాట జానపదం అని సమాచారం. చరణ్.. ఎన్టీఆర్ ఇద్దరూ బ్రిలియంట్ డ్యాన్సర్స్ కాబట్టి రాజమౌళి ఇద్దరి పై సూపర్ డ్యాన్సులు ఉండేలా పాట ప్లాన్ చేస్తారన్న సంగతి తెలిసిందే. ఈ పాట కోసం ప్రత్యేకంగా ఒక సెట్ నిర్మాణం జరుగుతోందట. త్వరలోనే ఈ సెట్ లో పాట చిత్రీకరణ జరుగుతుందని సమాచారం. టాలీవుడ్ టాప్ డ్యాన్సర్లు ఒకే స్క్రీన్పై స్టెప్పులేస్తే.. విజిల్స్తో మోత మోగాల్సిందే.
Recommended Video
కోర్టుకు సన్నివేశానికి సంబంధించిన సన్నివేశాలు..
ఇప్పటికే యాభై శాతానికి పైగా షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా తాజా షెడ్యూల్ హైదరాబాద్ లోని రామోజీ ఫిలిం సిటీలోని ప్రత్యేక సెట్లో జరుపుతున్నారు. ఈ సినిమాలో అల్లూరి సీతారామరాజుగా నటిస్తున్న రామ్ చరణ్ మరియు ఇతర తారాగణంపై కోర్టు నేపథ్యంలో వచ్చే సన్నివేశాల చిత్రీకరణ జరుగుతోంది. ఈ చిత్రం వచ్చే ఏడాది జూలై 30న రిలీజ్ చేస్తామని ప్రకటించినా.. విడుదలలో జాప్యం కానుందనే వార్తలు హల్చల్ చేస్తున్నాయి. మరి ఏం జరగుతుందో చూడాలి.