twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఎన్టీఆర్ 'ఊసరవెల్లి' లో మోసపోయారా?

    By Srikanya
    |

    జూ ఎన్టీఆర్ తాజా చిత్రం ఊసరవెల్లి అనుకున్నంత విజయం సాధించలేదు. చాలా చోట్ల డివైడ్ టాక్ వచ్చింది. అప్పటికీ మీడియాలో పబ్లిసిటీని పెంచి కలెక్షన్స్ డ్రాప్ అవకుండా ట్రై చేస్తున్నారు. కానీ ఈ పరిస్దితికి కారణం ఎన్టీఆర్ ఎడిటింగ్ పూర్తయ్యే వరకూ అసలేం తీసారో తెలియకపోవటమే అంటున్నారు. అయితే అప్పటికీ ఈ విషయాన్ని ఎన్టీఆర్ కవర్ చేసుకుందామనే ట్రే చేస్తున్నాడు. హీరోయిన్ మీద రన్ అయ్యే సినిమా అనేసరికి అందరికీ రిస్క్ అనే భావన వస్తుంది. కానీ నేను తొలిసారి వినగానే కథ బాగా నచ్చింది. అస్సలు హీరోయిన్ మీద నడవకపోతే కథలో కొత్తదనమేముంటుంది. లేడీస్ అందరూ ఈ కథకు అంత బాగా కనెక్టు అవుతున్నారంటే కారణం కథే. కాకపోతే టైటిల్ పరంగా కొంత ఆలోచించా అన్నారు. ఇక ఈ చిత్రం నా జీవితంలో ఇదో ప్రత్యేక చిత్రంగా మిగిలిపోతుంది.

    కథా పరంగా ఓ ప్రయోగం గా అనిపించింది. ఇంటర్వెల్ అయిన తర్వాత తమన్నా ప్లాష్ బ్యాక్ మొదలవుతుంది. దాదాపు ఇరవై నిముషాల సేపు హీరో కనపడడు. వాణిజ్య అంశాలు మేళవించిన చిత్రాల్లో ఇలాంటి ఎత్తుగడ ఓ ప్రయోగం.. ప్రమాదం అన్నారు. కానీ సురేంద్రరెడ్డి ఈ పాయింటు చెప్తున్నప్పుడు బాగా నచ్చి చేసాను అంటున్నారు. ప్రేక్షకులు గుర్తించే ముందే తాను క్లారిటీ ఇచ్చేస్తే మంచిదనే ఇలా ఎన్టీఆర్ అంటున్నాడని అంటున్నారు. మరో ప్రక్క అతను దెబ్బ తిన్నాడని, కిక్ సినిమా హిట్ అయ్యిందని ఈ సినిమా ఇచ్చాడని చెప్పుకుంటున్నారు. ఇక చివరి నిముషంలో తన క్యారెక్టర్ లేకపోవటం తెలిసినా రిలీజ్ డేట్ దగ్గరకి రావటంతో ఏమీ చేయలేని పరిస్ధితి ఆయన్ని మోసపోయాలా చేసిందని అంటున్నారు.

    English summary
    Ntr was unaware of this till the last hour when he saw the final copy of film. He was made to believe that, heros character will be mysterious and will bring a new shade in his career.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X