మొత్తానికి స్టార్ దర్శకులతో.. ఓ ప్లాన్ సెట్ చేసుకున్న తారక్
జూనియర్ ఎన్టీఆర్ నెక్స్ట్ RRR సినిమాతో ప్రేక్షకుక ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే. దర్శకధీరుడు ఎస్ఎస్.రాజమౌళి తెరకెక్కిస్తున్న ఆ సినిమాలో మరో హీరోగా రామ్ చరణ్ నటిస్తుండడంతో సౌత్ లోనే కాకుండా నార్త్ లో కూడా అంచనాల డోస్ ఆకాశాన్ని తాకేశాయి. అయితే తారక్ RRR తరువాత చేయబోయే సినిమాకు సంబంధించిన మరొక ఇంట్రెస్టింగ్ అప్డేట్ లీక్ అయ్యింది.
జూనియర్ ఎన్టీఆర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ తో మరో సినిమా చేయబోతున్న విషయం తెలిసిందే. అరవింద సమేత కంటే హై వోల్టేజ్ కథతో రెడీ అవుతున్న ఈ కాంబో షూటింగ్ ఇంకా పట్టాలెక్కలేదు. RRR అయిపోయిన మరుక్షణమే త్రివిక్రమ్ తో కలవాలని అనుకుంటున్నాడు. ఇక కుదిరితే ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా మే 20న సినిమా షూటింగ్ ను స్టార్ట్ చేయాలని ఒక ప్లాన్ సెట్ చేసుకున్నట్లు తెలుస్తోంది.

మళ్ళీ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో కూడా మరో పాన్ ఇండియా సినిమాను చేయాలని అనుకుంటున్న తారక్ ముందుగా త్రివిక్రమ్ సినిమాను ఇదే ఏడాదిలో వీలైనంత వరకు పూర్తి చేయాలని ప్లాన్ వేశాడు. ఇక ప్రశాంత్ నీల్ సలార్ కూడా ఇదే ఏడాదిలో ముగుస్తుంది కాబట్టి వచ్చే ఏడాది ఆరంభలోనే అతనితో మరో పాన్ ఇండియా ప్రాజెక్టును లైన్ లోకి తేవాలని చూస్తున్నాడు. మరి ఈ ప్లాన్స్ ఎంతవరకు వర్కౌట్ అవుతాయో చూడాలి.


Click it and Unblock the Notifications











