Don't Miss!
- News జైల్లో చిప్పకూడే.: కేటీఆర్కు సీఎం రేవంత్ రెడ్డి స్ట్రాంగ్ కౌంటర్
- Automobiles గిఫ్ట్ అంటే అబ్బాయిలే ఇవ్వాలా.??.. పెళ్లిలో వరుడికి వధువు అదిరిపోయే బైక్ గిఫ్ట్.. వైరల్ వీడియో చూసేయండి
- Sports RCB vs KKR: సారీ.. మా ఆటగాళ్ల పేర్లు మరిచిపోయా: శ్రేయస్ అయ్యర్ వీడియో
- Technology 32MP+32MP సెల్ఫీ కెమెరాలతో షియోమీ కొత్త స్మార్ట్ఫోన్.. స్పెసిఫికేషన్లు, ఫీచర్ల వివరాలు..!
- Lifestyle Human Brain Size రోజు రోజుకు పెరుగుతున్న మానవ మెదడు సైజు, రాబోవు కాలంలో బహుషా ఈ వ్యాధులు ఉండవకపోవచ్చు..
- Finance Shapoorji Pallonji IPO: షాపూర్జీ పల్లోంజీ గ్రూప్ నుంచి భారీ ఐపీఓ..
- Travel నహర్ఘర్ కోట దెయ్యాల కోటగా ఎందుకు మారింది? ఈ స్టోరీ తెలిస్తే ఆశ్చర్యపోతారు!
జూ.ఎన్టీఆర్ తో ఆ జానపదం?
జూనియర్ ఎన్టీఆర్ హీరోగా అప్పట్లో సంచలన విజయం సాధించిన పాతాళభైరవి చిత్రం రీమేక్ చేయటానికి ఓ ప్రముఖ నిర్మాణ సంస్ధ ప్లాన్ చేస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. గ్రాఫిక్స్ తో వచ్చిన మగధీర ఇచ్చిన విజయం ఈ చిత్రం రీమేక్ కు పురికొల్పుతోందని తెలుస్తోంది. ఇందునిమిత్తం ఇప్పటికే ఈ స్క్రిప్టును ఈ కాలం గ్రాఫిక్స్ కు చోటిచ్చేలా మార్చి రాయటానికి కసరత్తు సైతం జరుపుతున్నట్లు చెప్తున్నారు. అందుకోసం ఆ చిత్రం నిర్మాతలు విజయా వారితో చర్చలు జరిపి ఓ ఎగ్రిమెంట్ కు వస్తున్నారని, అందుకోసం టాక్స్ జరుగుతున్నాయని తెలుస్తోంది. అలాగే జూనియర్ ఎన్టీఆర్ కూడా తన తాతగారు నటించిన ఈ రీమేక్ లో చేయటానికి ఉత్సాహం చూపుతున్నాడుని వినపడుతోంది. ఇక 1951లో విజయా సంస్ద ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ చిత్రంలో ఎన్టీఆర్ కథానాయకుడుగాను,ఎస్వీ రంగారావు ప్రతినాయకుడుగా చేసి మెప్పించారు. తెలుగువారు గర్వంగా చెప్పుకునే ఈ చిత్రాన్ని కె.వి.రెడ్డి డైరక్ట్ చేసారు. ఇంతకీ భారీ బడ్జెట్ తో ఈ రీమేక్ ని నిర్మించటానికి ఆసక్తి చూపించే సంస్ధ ఏదైఉంటుందంటారు.