twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    జూ.ఎన్టీఆర్ తో ఆ జానపదం?

    By Staff
    |

    జూనియర్ ఎన్టీఆర్ హీరోగా అప్పట్లో సంచలన విజయం సాధించిన పాతాళభైరవి చిత్రం రీమేక్ చేయటానికి ఓ ప్రముఖ నిర్మాణ సంస్ధ ప్లాన్ చేస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. గ్రాఫిక్స్ తో వచ్చిన మగధీర ఇచ్చిన విజయం ఈ చిత్రం రీమేక్ కు పురికొల్పుతోందని తెలుస్తోంది. ఇందునిమిత్తం ఇప్పటికే ఈ స్క్రిప్టును ఈ కాలం గ్రాఫిక్స్ కు చోటిచ్చేలా మార్చి రాయటానికి కసరత్తు సైతం జరుపుతున్నట్లు చెప్తున్నారు. అందుకోసం ఆ చిత్రం నిర్మాతలు విజయా వారితో చర్చలు జరిపి ఓ ఎగ్రిమెంట్ కు వస్తున్నారని, అందుకోసం టాక్స్ జరుగుతున్నాయని తెలుస్తోంది. అలాగే జూనియర్ ఎన్టీఆర్ కూడా తన తాతగారు నటించిన ఈ రీమేక్ లో చేయటానికి ఉత్సాహం చూపుతున్నాడుని వినపడుతోంది. ఇక 1951లో విజయా సంస్ద ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ చిత్రంలో ఎన్టీఆర్ కథానాయకుడుగాను,ఎస్వీ రంగారావు ప్రతినాయకుడుగా చేసి మెప్పించారు. తెలుగువారు గర్వంగా చెప్పుకునే ఈ చిత్రాన్ని కె.వి.రెడ్డి డైరక్ట్ చేసారు. ఇంతకీ భారీ బడ్జెట్ తో ఈ రీమేక్ ని నిర్మించటానికి ఆసక్తి చూపించే సంస్ధ ఏదైఉంటుందంటారు.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X