Don't Miss!
- News Lok Sabha Election 2024: నేడే తొలి దశ పోలింగ్, 102 స్థానాల్లో ఎన్నికలకు సర్వం సిద్ధం
- Sports PBKS vs MI: అతను అసాధారణ బ్యాటింగ్తో భయపెట్టాడు: హార్దిక్ పాండ్యా
- Lifestyle గుడ్నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Technology 40 గంటలకు పైగా బ్యాటరీ బ్యాకప్, ChatGPT వాయిస్ AI సపోర్టుతో నథింగ్ ఇయర్బడ్స్ విడుదల.. సేల్ వివరాలు!
- Automobiles గొప్ప మనసు చాటుకున్న రాఘవ లారెన్స్.. దివ్యాంగులకు టీవీఎస్ స్కూటర్ల పంపిణీ
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
డైరెక్టర్ క్రిష్తో జూ ఎన్టీఆర్ సంప్రదింపులు?
హైదరాబాద్: ‘రామయ్యా వస్తావయ్యా', ‘రభస' ఇలా వరుస పరాజయాలతో సతమతం అవుతున్న జూ ఎన్టీఆర్కు కథల ఎంపిక విషయంలో తర్జన భర్జనలు పడుతున్నాడు. రొటీన్ కమర్షియల్ కథలను ఎంచుకుని ఖంగుతిన్న...కొత్త కథలను ఎంచుకోవడంలో కూడా తర్జన భర్జనలు పడుతున్నాడు. అయితే ఎలాగైనా హిట్ట కొట్టాలనే తాపత్రయం మాత్రం ఎన్టీఆర్లో కనిపిస్తోంది.
ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ వివిధ దర్శకులను తన తర్వాతి సినిమా కోసం పరిశీలిస్తున్నాడు. తెలుగులో గమ్యం, వేదం, కృష్ణం వందే జగద్గురుమ్ చిత్రాలకు దర్శకత్వం వహించి ప్రస్తుతం బాలీవుడ్లో ‘గబ్బర్' సినిమా చేస్తున్న డైరెక్టర్ క్రిష్తో ఎన్టీఆర్ సంప్రదింపులు జరినట్లు తెలుస్తోంది. అన్ని ఓకే అయితే వీరి కాంబినేషన్లో సినిమా వచ్చే అవకాశం ఉంది. ఈ చిత్రాన్నిఅశ్వనీదత్ నిర్మించనున్నట్లు ఇండస్ట్రీ టాక్.
ప్రస్తుతం ఎన్టీఆర్ పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. మాస్ యాక్షన్ ఎంటర్టెనర్ గా రూపొందుతోన్న ఈచిత్రంలో జూ ఎన్టీఆర్ పవర్ ఫుల్ పోలీసాఫీసర్ పాత్రలో కనిపించనున్నారు. ఈ చిత్రానికి వక్కతం వంశీ కథ అందిస్తున్నారు. పూరి జగన్నాధ్ తన ట్రేడ్ మార్క్ డైలాగ్స్, ఫాస్ట్ స్క్రీన్ ప్లే ని జోడించాడు. గతంలో వక్కంతం వంశీ..ఎన్టీఆర్ నటించిన అశోక్, ఊసరవెల్లి చిత్రాలకు కథలు అందించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాకి దేవీశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నాడు. పరమేశ్వర ఆర్ట్ ప్రొడక్షన్స్ పై బ్లాక్ బస్టర్ హిట్స్ ని అందించిన బండ్ల గణేష్ ఈ సినిమాని నిర్మిస్తున్నాడు.