Don't Miss!
- Sports RR vs DC: కన్నీటి పర్యంతమైన రియాన్ పరాగ్!
- News గ్యాంగ్స్టర్, రాజకీయ నేత ముఖ్తార్ అన్సారీ గుండెపోటుతో మృతి
- Lifestyle Love Horoscope For April 2024:ఈ రాశులకి ఏప్రిల్ లో LOVE సక్సెస్ అవుతుంది..మరికొందరికి అడ్డంకులు తప్పవు
- Technology రియల్మి కొత్త ఫోన్ టీజర్ విడుదల.. సెగ్మెంట్లోనే సన్నని డిజైన్ సహా కీలక ఫీచర్లు..!
- Automobiles 6 కోట్ల కస్టమర్లతో భారత్లో హోండా తిరుగులేని రికార్డు.. ఎక్కువగా వీటిపైనే క్రేజ్.!!
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
జూ ఎన్టీఆర్, మహేష్ కామెంట్స్ కి దూరంగాఉండాలంటే..వదిలేస్తే బెటరే...
ఏ ముహుర్తాన తలనొప్పి బామ్ లకి బ్రాండ్ అంబాసిడర్లుగా మారారో కానీ వెంటనే మహేష్ బాబు, జూ ఎన్టీఆర్ గట్టి ఝలక్ తిన్నారు. అమృ తాంజన్ తో ఒప్పందం చేసుకున్న వెంటనే మహేష్ కి ఖలేజా, జండూబామ్ కి సైన్ చేయగానే ఎన్టీఆర్ కి శక్తి వచ్చి పడ్డాయి. అన్నట్టు వీరిద్దరూ నవరతన్ కి జంట అంబాసిడర్లుగా కూడా పని చేస్తున్నారు. ఇద్దరికీ ఇవి అంతగా కలిసొచ్చినట్టు అనిపించడం లేదు.
మిగతా వాటి మాట ఎలా ఉన్నా కానీ నొప్పి ఆయింట్ మెంట్ లకి ప్రచారకర్తలుగా వ్యవహరిస్తుంటే, తమ సినిమాలు వచ్చినప్పుడు వేరే హీరోల అభిమానులు తమని కామెంట్ చేయడానికి సులువైన మార్గాలు లభిస్తున్నాయని మహేష్, ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. ఖలేజా, శక్తి వచ్చినప్పడు జండూబామ్, అమృ తాంజన్ బొమ్మలు వాడి ఇతర హీరోల అభిమానులు చేసి హంగామా అంతా ఇంతా కాదు. సాధారణంగా ఇలాంటి యాడ్స్ కి హీరోలు దూరంగా ఉంటారని, బాలీవుడ్ లోనూ ఎవరూ ఇలాంటివి చెయ్యరు కాబట్టి మనోళ్లూ త్వరగా వీటిని వదిలించుకుంటే బాగుంటుందని వారు వాపోతున్నారు.