Don't Miss!
- News మోదీ వలనే బంగారు రేటు పెరిగింది, ఐటీ అధికారులకు కళ్లు ఉన్నాయా, టీడీపీతో పొత్తు పెట్టుకుని ?
- Technology Infinix GT 20 Pro 5G డిజైన్ రెండర్లు లీక్ అయ్యాయి! స్పెసిఫికేషన్ల వివరాలు
- Sports అతని వల్లే RCB టైటిల్ చేజారింది- అనిల్ కుంబ్లే
- Finance Swiggy IPO: ఐపీఓగా రానున్న స్విగ్గీ..!
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Lifestyle వేసవిలో మైగ్రేన్ తలనొప్పి ఎందుకు పెరుగుతుంది, లక్షణాలు, ఉపశమనం ఎలా పొందాలో తెలుసుకోండి
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
మాజీ ప్రియురాలిని ఫామ్ హౌస్ లో సీక్రెట్ గా కలిసిన జూ ఎన్టీఆర్...
టాలీవుడ్ లో ఒకప్పుడు ప్రేమించుకొని, ప్రేమ ముదిరి, పెళ్లిదాక వెళ్లి విడిపోయిన జూ ఎన్టీఆర్ ను సమీర రెడ్డి హైదరాబాద్ లో మళ్లీ కలిశారని తెలిసింది. 'ఎర్ర గులాబీలు" సినిమా ప్రమోషన్ సందర్భంగా, హీరోయిన్ సమిరా రెడ్డి హైదరాబాదుకు వచ్చింది. జూ ఎన్టీఆర్ ను సీక్రెట్ గా కలిసిందని టాలీవుడ్ లో టాక్.
జూ ఎన్టీఆర్, సమీరా రెడ్డి కలసి నటించిన మొదటి సినిమా నరసింహుడు ఈ సినిమాలో వీళ్లిద్దరూ బాగా క్లోజ్ అయ్యారనేది వాస్తవం. ఈ క్లోజ్ 'అశోక్" సినిమాతో తారాస్థాయికి వెళ్లి, ప్రేమ పెళ్లిదాకా వెల్లిందనేది వాస్తవం. సమీర రెడ్డి పెళ్లి చేసుకుందామనే ప్రపోజల్ ను తన వయస్సు చిన్నది కాబట్టి కొంతకాలం ఆగమని చెప్పాడు జూ ఎన్టీఆర్.
అయితే ఆ చిన్న గ్యాప్ లో 'జై చిరంజీవా" సినిమా చిరంజీవితో సమీరా రెడ్డి నటించటానికి ఓప్పుకోవటంతో, ఎన్టీఆర్ సహించలేక సమీర రెడ్డితో మాట్లాడటం మానేశాడని అప్పుట్లో టాలీవుడ్ లో గుసగుసలు. కాగా సమీరా రెడ్డి హైదరాబాద్ వచ్చిన తర్వాత, ఎన్టీఆర్ కు ఫోన్ చేసి నిన్ను కలసి మాట్లాడాలని ఉందని చెప్పడంతో జూ ఎన్టీఆర్ జరిగినవన్నీ మర్చిపోయి సమీరారెడ్డిని హైదరాబాదు ఊరి చివర ఒక ఫామ్ హౌస్ లో సీక్రెట్ గా కలిశాడని టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది.