twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఎన్టీఆర్ కు ఇరవై కోట్ల భవనం బహుమతి

    By Srikanya
    |

    జూ ఎన్టీఆర్ కు కాబోయో మామ దాదాపు ఇరవై కోట్ల రూపాయల విలువైన ఇంటిని ప్రముఖ నిర్మాత కెఎస్ రామారావు నుంచి కొనుగోలు చేసి గిప్ట్ గా ఇస్తున్నారు. దాంతో తను ఉంటున్న మొహది పట్నం నుంచి నివాసాన్ని జూబ్లీహిల్స్ కు త్వరలోనే ఎన్టీఆర్ మార్చనున్నారు. జూబ్లిహిల్స్ రోడ్ నెంబర్ 31లో (ప్లాట్ నెంబర్ 512-ఎన్) లో ఉన్న ఈ విశాలమైన భవనం పది రోజుల క్రితమే ఎన్టీఆర్ సొంతమైంది. ఈ భవింతికి ప్రస్తుతం మరామత్తులు చేస్తున్నారు.

    దాదాపు 1,587 గజాల విస్తీర్ణంలో ఉన్న ఈ ఇంటిలో...అత్యంత ఆధునిక సౌకర్యాలు, ఇటాలియన్ మార్బుల్, కెన్యా ఫర్నిచర్ ఉన్నాయి. ఇంటి ముఖ ద్వారం అత్యంత ఆకర్షనీయంగా తీర్చిదిద్దుతున్నారు. పూర్తిగా సింగపూర్ లో రూపొందించిన అద్దాలతో చేసిన ప్లోరింగ్ క్రింద భాగంలో నీటి కొలను ఏర్పాటు చేసి అందులో చేపలు పెంచతున్నారు.

    రెండంచెలుగా ఉన్న ఇంటి మొదటి దశను వీవీఐపీలు, నిర్మాతలు, దర్శకులుతో చర్చలు జరిపేందుకు వీలుగా నిర్మించారు. దీని వెనకాల అత్యంత ఆకర్షణీయంగా ఓ భవంతిని నిర్మించారు. మొత్తం ఎనిమిది బెడ్ రూమ్ లతో కూడిన ఈ ఇంటిలో మూడు పెద్ద హాళ్ళు ఉన్నాయి. ఇంటి వెనకాల అత్యంత సుందరమైన స్విమ్మింగ్ పూల్, ముఖద్వారం ప్రక్కనే జిమ్ కూడా ఏర్పాటు చేసారు. గత వారం రోజులగా ఈ ఇంటికి స్వల్ప మార్పులు చేస్తున్నారు.

    మే నెల చివరి వారంలో ఎన్టీఆర్ ఈ కొత్త ఇంటిలోకి ప్రవేశిస్తారని ఆయన సన్నిహితులు చెప్తున్నారు. గత కొద్ది రోజులుగా ఆయన రాత్రిపూట ఇక్కడకు వచ్చి ఇంటిని మార్పు, చేర్పులు దగ్గరుండి చేయించుకుంటున్నారు. ఆయన తల్లి షాలిని అక్కడే ఉండి ఇంటి మరామత్తులు చేయిస్తున్నారు. ఇటీవలే ఎన్టీఆర్, కాబోయే మామ నార్నే శ్రీనివాసరావు దంపతులు, కాబోయే భార్య లక్ష్మీ ప్రణతి కలసివచ్చి ఆ కొత్త ఇంటిని చూసి వెళ్ళారు.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X