Don't Miss!
- Finance Sensex News: 1000 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్.. దలాల్స్ట్రీట్ దున్నేస్తున్న బుల్స్..
- News ఏపీలో విపక్షాల ఫిర్యాదుల వేళ ఈసీ కీలక నిర్ణయం..! ఢిల్లీ నుంచి ఆ ముగ్గురు..
- Sports క్లాసెన్కు కావ్య మారన్ స్పెషల్ గిఫ్ట్!
- Automobiles హ్యుందాయ్ కస్టమర్లకు అదిరిపోయే న్యూస్.. వేసవిలో ప్రత్యేకంగా సర్వీస్ క్యాంప్.. ఎప్పటివరకు అంటే.??
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
- Lifestyle నోరూరించే పచ్చి మామిడికాయ గొజ్జు మామిడికాయ కర్రీ వేడివేడి అన్నంతో తింటుంటే ఆహా అనాల్సిందే..
- Technology ఆపిల్ వరల్డ్ వైడ్ డెవలపర్ కాన్ఫరెన్స్ 2024 తేదీ వెల్లడి.. iOS 18, GenAI పై కీలక ప్రకటనలకు అవకాశం..!
పవన్ కళ్యాణ్, మహేష్ బాబు లను ఎదుర్కోవడానికి జూ ఎన్టీఆర్ ప్లాన్...
ఒకప్పుడు తెలుగు పరిశ్రమలో అగ్రశ్రేణి ఫైనాన్షియర్ అయిన శింగనమల రమేష్ ఇప్పడు కాస్తా అట్టర్ ప్లాప్ ప్రొడ్యూసర్ గా ముద్ర వేయించుకున్నాడు. శింగనమల రమేష్ దివాళా తీయడంలో పవన్ కళ్యాణ్ సినిమా 'పులి", మహేష్ 'ఖలేజా"ముఖ్యపాత్ర పోషించాయి. ఈ రెండు సినిమాల మీద 30కోట్ల పైగా నష్టపోయిన శింగనమల రమేష్ ఇప్పుడు దాదాపుగా బయట తిరగడం తగ్గించేశాడు. అయితే శింగనమల రమేష్ కష్టాన్ని తెలుసుకుని అతనికో సినిమా చవకగా చేసి పెట్టాలని జూ ఎన్టీఆర్ చూస్తున్నాడు.
పవన్ కళ్యాణ్, మహేష్ బాబుల వల్ల కొంప కొల్లేరయిన నిర్మాతని తాను నిలబెడితే అంతా తన గురించి గొప్పగా చెప్పుకుంటారని జూ ఎన్టీఆర్ ప్లాన్ వేశాడు. బిజినెస్ పరంగా, క్రేజ్ పరంగా, తనకి పోటీదారులైన ఈ ఇద్దరు హీరోలని దాటేశాననిపించుకోవడానికి ఇది బాగా కలిసొస్తుందని యంగ్ టైగర్ అనుకుంటుంన్నాడు. శింగనమల రమేష్ పాలిట పవన్, మహేష్ ఎనిమీస్ అయితే తాను అతనికి ప్రెండ్ అవ్వాలని చూస్తున్నాడు. వాళ్లమీద ఆధిపత్యం చలాయించడం కోసం నిండా మునిగిన శింగనమలతో సినిమా మొదలు పెడితే, తీరా ఆ సినిమా సగంలో ఆగిపోతే జూ ఎన్టీఆర్ మెడకే చుట్టుకుని అవకాశముందని సినీ వర్గాలవారు హెచ్చరిస్తున్నారు.