జూ ఎన్టీఆర్-ప్రభాస్ ఇమేజ్ ను కించపరిచారంటూ ఫ్యాన్స్ గోలగోల..?
విశాల్, ఆర్య కాంబినేషన్ లో బాల దర్శకత్వంలో రూపొందిన వాడు-వీడు" చిత్రం ఇటీవల విడుదలయ్యింది. కధ తెలుగు నేటివిటికి దూరంగా ఉండటం, బోరింగ్ కధనం, వినోదం పాళ్ళు తక్కువగా ఉండటం, తమిళవాసన కొట్టడం అంటే పక్కా మాస్ తో రొటీన్ గా బోరింగా అనిపించడంతో ఈ సినిమా పెద్దంతగా తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. అలాగే ఎన్టీఆర్, ప్రభాస్ అభిమానుల ఆగ్రహానికి కూడా ఈ సినిమా గురయ్యిందని తెలుస్తోంది. ఈ సినిమాలోని కొన్ని డైలాగులు ఎన్టీఆర్, ప్రభాస్ లను ఉద్దేశించి చెప్పించినట్టుగా ఉన్నాయట..
దాంతో ఈ ఇద్దరు హీరోల అభిమానులు ఆగ్రహంగా ఉన్నారు. బాల దృష్టికి వచ్చే ఈ విధంగా చేసాడా?లేక తెలీక ఈ పొరపాటు జరిగిందా అనే విషయం తెలియాల్సి వుంది. మొత్తం మీద తమిళ ప్రేక్షకుల ఆదరణ పొందుతున్న ఈ సినిమా తెలుగులో ప్రేక్షకాదరణ పొందకపోవడం అటుంచితే ఇలాంటి వివాదంలో ఇరుక్కోవడం విశేషం..


Click it and Unblock the Notifications











