లైవ్ గా...ఎన్టీఆర్,పూరి చిత్రం ఎప్పటికప్పుడు
హైదరాబాద్ : కొంతకాలం దర్శకుడు,హీరో మధ్య ఇగో క్లాషెష్, కొంతకాలం భారీ వర్షాలు, మరికొంతకాలం స్ట్రైక్ ఇలా రకరకాల కారణాలు..పూరీ, ఎన్టీఆర్ సినిమాను ఆలస్యం చేస్తూ వస్తున్నాయి. ఈ నేపధ్యంలో ఆ లేటు వెళ్లి ముందుగా ప్రకటించిన రిలీజ్ డేట్ మీద పడకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు పూరీ. అందులో భాగంగా లైవ్ ఎడిటింగ్ ని చేయిస్తున్నారని విశ్వసనీయ సమాచారం. ఇందునిమిత్తం గోవా షూటింగ్ స్పాట్ కు ఎడిటర్ ఎస్.ఆర్.శేఖర్ వెళ్లారు. గతంలో ఎస్.ఆర్.శేఖర్.. పూరి చిత్రం ఇద్దరమ్మాయిలతో ట్రైలర్ కట్ చేసారు. ఆ ట్రైలర్ ప్రాజెక్టుకు మంచి క్రేజ్ తెచ్చిన సంగతి తెలిసిందే.
షూటింగ్ అయిన దాన్ని ఎప్పటికప్పుడు ఎడిట్ చేసేస్తూంటారు. దాని మూలంగా బాగా రాని షాట్స్, మర్చిపోయిన షార్ట్ ఎప్పటికప్పుడు తెలిసిపోయి... ప్యాచ్ వర్క్ వంటివి నివారించవచ్చు. అలాగే ఎడిటింగ్ అయ్యే సమయం కలిసివస్తుంది. ప్రస్తుతం రఫ్ ఎడిటింగ్ చేసుకుని చివర్లో కాస్త టైమ్ తీసుకుని ఫైనల్ ఎడిటింగ్ చేసేస్తారు.

సినీ కార్మికులు సమ్మె విరమించడంతో షూటింగ్ లు మళ్లీ మొదలవుతున్నాయి. ఎన్టీఆర్, పూరి జగన్నాథ్ల సినిమా స్వల్ప విరామం తర్వాత ప్రారంభమైంది. ఎన్టీఆర్ సినిమా అంటే మాస్ ప్రేక్షకులకు పండగే. పోరాట ఘట్టాలూ, నృత్యాలూ, పదునైన సంభాషణలతో విందు భోజనం వడ్డించేస్తారు. ఇలాంటి కథల్ని తెరపై ఆవిష్కరించడంలో దిట్ట పూరి జగన్నాథ్. వీరిద్దరి కలయికలో ఓ చిత్రం రూపుదిద్దుకొంటోంది. కాజల్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రానికి బండ్ల గణేష్ నిర్మాత.
ప్రస్తుతం గోవాలో చిత్రీకరణ సాగుతోంది. అక్కడ యాక్షన్ ఘట్టాలతో పాటు కొన్ని సరదా సన్నివేశాల్ని తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో ఎన్టీఆర్ శక్తిమంతమైన పోలీసు అధికారిగా కనిపిస్తాడని సమాచారం. 'నేనో రకం', 'టెంపర్' అనే పేర్లు పరిశీలనలో ఉన్నాయి. జనవరి 9న ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ చిత్రానికి సంగీతం: అనూప్ రూబెన్స్ .


Click it and Unblock the Notifications











