twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    జూ ఎన్టీఆర్ తో అనుకున్న ఆ భారీ ప్రాజెక్టు ఆగినట్లే!!

    By Srikanya
    |

    జూ ఎన్టీఆర్ తో శ్యామ్ ప్రసాద్ రెడ్డి నిర్మాతగా 'పాతాళభైరవి' రీమేక్ చేద్దామని నిర్ణయించుకున్న సంగతి తెలిసిందే. అయితే కొద్ది రోజుల డిస్కషన్ అనంతరం దీన్ని ఆపువేశినట్లు తెలుస్తోంది. అనుకున్న బడ్జెట్ కీ,మార్కెట్ కీ చాలా గ్యాప్ ఉండటంతో ఈ ప్రాజెక్టుని అటకెక్కించినట్లు తెలుస్తోంది. ఇక ఎన్టీఆర్ స్క్రిప్టులో చెప్పిన మార్పులు కూడా ఈ ప్రాజెక్టు మెటీరియలైజ్ కాకపోవటానికి ఓ కారణం అని చెప్తున్నారు. ఇక శ్యామ్ ప్రసాద్ రెడ్డి 'అరుంధతి' వంటి భారీ విజయం సాధించిన చిత్రం తర్వాత ఇప్పటివరకూ ఏ చిత్రమూ ప్రారంభించలేదు. తమ గ్రాఫిక్ డిజైనర్ రాహుల్ నంబియార్ ని డైరక్ట్ చేద్దామని ప్రయత్నించి అనుకున్న కథ కుదరక ఆ ప్రయత్నం ఆపు చేసారు. అలాగే ప్రస్తుతం ఎన్టీఆర్ నటించిన 'బృందావనం' రేపు(13-10) రిలీజ్ అవుతోంది. కాజల్,సమంత నటించిన ఈ చిత్రంపై మంచి అంచనాలే ఉన్నాయి.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X