Don't Miss!
- Automobiles కూతురిపై ప్రేమ - కోట్ల రూపాయల కారు గిఫ్ట్ ఇచ్చిన తండ్రి వీడియో
- Finance Essential Medicines: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న అవసరమైన ఔషధాల ధరలు..
- News పురందేశ్వరికి చెక్ పెడుతోందెవరు - చంద్రబాబు ఎటువైపు..!?
- Sports `దాదా` మళ్లీ మొదలు పెట్టాడయ్యా: హీటెడ్ ఆర్గ్యుమెంట్
- Technology రూ.12వేల కంటే తక్కువ ధరకే స్మార్ట్ఫోన్.. సెగ్మెంట్లో తొలిసారిగా 45W ఫాస్ట్ ఛార్జింగ్, డ్యూయల్ స్పీకర్లు..!
- Lifestyle Love Horoscope For April 2024:ఈ రాశులకి ఏప్రిల్ లో LOVE సక్సెస్ అవుతుంది..మరికొందరికి అడ్డంకులు తప్పవు
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
జూ ఎన్టీఆర్ ని భయపెట్టిందెవరు?
ఎమోషనల్ స్టార్ గా పేరు తెచ్చుకున్న ఎన్టీఆర్ సైతం భయానికి గురైయ్యాడు. ఆ భయానికి మాత్రం కారణం సాక్షాత్తు వి.వి.వినాయకే. ఇంతకీ ఎన్టీఆర్ని వినయ్ ఎలా భయపెట్టాడంటారా? అయితే మనం ఒకసారి 2001 కి వెళ్ళాల్సిందే. ఎందుకంటే ఈ సంఘటన అప్పటిదే కాబట్టి, 'సుబ్బు" షూటింగ్ కోసం న్యూజిలాండ్ లో వున్న ఎన్టీఆర్ అక్కడి షూటింగ్ లోకేషన్ కు కూసింత దూరంటో ఓ నల్లని భారీ ఆకారం తననే తదేకంగా చూస్తుండడం గమనించాడు. ఇలా రెండు మూడు సార్లు ఆ ఆకారాన్ని చూసిన ఎన్టీఆర్ ఒకానొక దశలో భయానికి గురైయ్యాడు.
అయితే అతన్ని దగ్గరికి పిలిపించుకున్నాక తెలిసింది....తన కోసం సినిమా తయారు చేసుకుని ఆ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయం అయ్యే అవకాశం పొందాలన్నదే అతని ఆశ అని. ఎన్టీఆర్ కు వివివినాయక్ చెప్పిన కథ నచ్చడంతో వెంటనే వారి కాంబినేషన్ లో 'ఆది" ప్రారంభమైనది. ఇక 'ఆది" ఎంతటి సెన్సేషనల్ చిత్రమైందో అందరికీ తెలిసిందే.