Don't Miss!
- Technology వన్ప్లస్ 13 స్మార్ట్ఫోన్ కీలక వివరాలు లీక్.. 6.8 అంగుళాల డిస్ప్లే, 50MP కెమెరా సహా.. పూర్తి వివరాలు..!
- Sports KKR Playing XI: రూ. 24.75 కోట్ల ఆటగాడిపై వేటు! పంజాబ్తో తలపడే కేకేఆర్ తుది జట్టు ఇదే!
- News మరో ఎమ్మెల్సీ ఉపఎన్నికకు షెడ్యూల్ విడుదల: బరిలో తీన్మార్ మల్లన్న
- Lifestyle పాలలో తామరవిత్తనాలు కలుపుకొని తాగితే ఇన్ని ప్రయోజనాలుంటాయా..?
- Finance Jio Cinema Premium: నెలకు 29లతో జియో ప్రీమియం..
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
హ్యాండిచ్చాడా? జూ ఎన్టీఆర్ కూడా అ బాపతేనా?
హైదరాబాద్: వరుస హిట్లతో దూసుకెళ్లే దర్శకులతో సినిమాలు చేయడానికి ఆసక్తి చూపడం, ప్లాపుల బాటలో ఉన్న దర్శకులను దూరం పెట్టడం టాలీవుడ్ హీరోల స్టైల్. అందరూ అలా కాక పోయినా కొందరు స్టార్ హీరోలు మాత్రం అలాంటి బాపతే. తాజాగా జూ ఎన్టీఆర్ కూడా ఈ కోవలోకే వస్తాడని ఫిల్మ్ నగర్ జనాలు గుసగుసలాడుకుంటున్నారు.
ఆ మధ్య దర్శకుడు సుకుమార్ తో సినిమా చేయడానికి ఆసక్తి చూపిన జూ ఎన్టీఆర్......ఇటీవల సుకుమార్ దర్శకత్వంలో వచ్చి '1-నేనొక్కడినే' చిత్రం ప్లాపు కావడంతో ఆయనతో సినిమా చేయడానికి ఆసక్తి చూపడం లేదట. సుకుమార్తో కాకుండా ఇతర దర్శకులకు ఇంపార్టెన్స్ ఇస్తున్నాడట. మరి గుసగుసల్లో నిజమెంతో తేలాల్సి ఉంది.
ప్రస్తుతం రభస చిత్రంలో నటిస్తున్న జూ ఎన్టీఆర్...ఈ చిత్రం తర్వాత పూరి దర్శకత్వంలో ఓ సినిమాకు రెడీ అవుతున్నాడు. ఈ చిత్రంలో జూ ఎన్టీఆర్ రఫ్ అండ్ టఫ్ పోలీసు పాత్రలో కనిపించబోతున్నారు. ఈ చిత్రంలో జూ ఎన్టీఆర్ సరసన కాజల్ను హీరోయిన్గా తీసుకుంటున్నారు. ఈ చిత్రానికి 'రుబాబు', 'టెంపర్' అనే టైటిల్స్ పరిశీలిస్తున్నారు. ఎప్పుడూ సొంత స్క్రిప్టులతోనే సినిమాలు చేసే పూరి జగన్నాథ్ ఈ సారి వక్కతం వంశీ అందించిన స్టోరీతో సినిమా తీస్తుండటం విశేషం.
గతంలో పూరి జగన్నాథ్ దర్శకత్వంలో 'పోకిరి' అనే సినిమా వచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా జూ ఎన్టీఆర్తో చేసే సినిమా కూడా అదే రేంజిలో ఉంటుందని అంటన్నారు. ఈ చిత్రాన్ని బండ్ల గణేష్ నిర్మించనున్నారు. గతంలో జూ ఎన్టీఆర్ 'బాద్ షా' చిత్రాన్ని నిర్మించి హిట్ కొట్టిన గణేష్ ఇప్పుడు మరోసారి ఎన్టీఆర్తో చేసే ఛాన్స్ రావడంపై ఆనందంగా ఉన్నాడు.
ప్రస్తుతం జూ ఎన్టీఆర్ 'రభస' చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం షూటింగ్ చివరి దశకు చేరుకుంది. సినిమా పూర్తయిన వెంటనే పూరి జగన్నాథ్ తన సినిమాను ప్రారంభించడానికి ప్లాన్ చేసుకుంటున్నాడు ఎన్టీఆర్. పక్కా ప్లానింగుతో సినిమా తీసే పూరి జగన్నాథ్ వీలైనంత త్వరగా సినిమాను ప్రేక్షకుల ముందుకు తెచ్చేందుకు ప్లాన్ చేస్తున్నాడట. పదేళ్ల క్రితం పూరి జగన్నాథ్-జూ ఎన్టీఆర్ కాంబినేషన్లో 'ఆంధ్రావాలా'చిత్రం వచ్చింది. అయితే ఆ సినిమా పెద్దగా ఆడలేదు. చాలా కాలం తర్వాత ఇద్దరి కాంబినేషన్లో సినిమా వస్తుండటంతో ఎన్టీఆర్ అభిమానుల్లో ఆసక్తి నెలకొంది.