Don't Miss!
- News కేసీఆర్కు ఎన్నికల సంఘం నోటీసులు
- Sports KKR vs RR: ఈ ఓటమి బాధ వర్ణాతీతం.. మాటలు రావడం లేదు: శ్రేయస్ అయ్యర్
- Lifestyle 30 ఏళ్లు దాటిన తర్వాత పెళ్లి చేసుకునే వారు ఈ విషయాలు తప్పక గుర్తుంచుకోవాల్సిన విషయాలు
- Automobiles ఆటో డ్రైవర్లకు గుడ్ న్యూస్.. ఇకపై ఓలా, ఉబర్, ర్యాపిడో యాప్ల్లో ఈ ఆప్షన్ ఉండదు.!!
- Technology ఎలోన్ మస్క్ StarLink ఇంటర్నెట్ ఇండియా లాంచ్ త్వరలోనే! ప్రభుత్వం ఆమోదించింది
- Travel Ramanarayanam Temple: విజయనగరంలోని ఈ రాములవారి ఆలయ ప్రత్యేకతలెన్నో..!
- Finance Market Closing: సెన్సెక్స్-నిఫ్టీ ఢమాల్.. మూడోరోజూ కొనసాగిన అమ్మకాల ఒత్తిడి..
అందరూ ఇంటికొస్తే ఈ క్రికెటర్ మాత్రం నటితో రొమాన్స్.. లండన్లో రెడ్ హ్యాండెడ్గా..
Recommended Video
ఇటీవల ఇంగ్లండ్ వేదికగా జరిగిన ప్రపంచకప్ నుంచి భారత క్రికెట్ జట్టు సెమీస్లోనే నిష్క్రమించిన విషయం తెలిసిందే. ఈ ఓటమి తర్వాత భారత ఆటగాళ్లంతా ఎవరి ఇళ్లకు వాళ్లు వెళ్లిపోయారు. అయితే, యువ క్రికెటర్ లోకేష్ రాహుల్ మాత్రం లండన్లోనే ఉండిపోయాడట. దీనికి కారణం అతడు తన గర్ల్ ఫ్రెండ్తో రొమాన్స్ చేయడం కోసమేనని తాజాగా ఓ వార్త బయటకు వచ్చింది. దీంతో ఈ యంగ్ క్రికెటర్ మరోసారి హాట్ టాపిక్గా నిలిచాడు.
ప్రేయసితో చెట్టాపట్టాల్..
లోకేష్ రాహుల్ లండన్ వీధుల్లో ఓ అమ్మాయితో చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నాడని ఓ కథనం ప్రసారం జరుగుతోంది. దీని ప్రకారం.. రాహుల్, బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి కుమార్తె అతియా శెట్టితోనే కలిసి తిరుగుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ప్రపంచకప్ ముగిసిన తర్వాత వీళ్లిద్దరూ అక్కడే కలిసి ఉన్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి.
రెడ్ హ్యాండెడ్గా..
రాహుల్.. అతియాతో కలిసి తిరుగుతున్న విషయం బయటకు రావడానికి కారణం వీళ్లిద్దరూ లండన్లో ప్రచురణయ్యే పత్రికల వారికి దొరికిపోవడమేనని సమాచారం. దీనికి సంబంధించిన కథనాన్ని సదరు పత్రిక కూడా ప్రచురించిందట. ఈ కారణంగానే ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
గతంలో ఫొటో షేర్ చేయడంతో..
గతంలో అతియా శెట్టితో రాహుల్ ప్రేమలో ఉన్నాడంటూ వార్తలు రావడానికి కారణం.. ఆమె స్నేహితురాలు పోస్ట్ చేసిన ఫొటోనే. కేఎల్ రాహుల్, అతియాలతో కలిసి ఉన్న ఫొటోను తన ఇనిస్టాగ్రామ్లో పోస్టు చేసిన ఆకాంక్ష "ఆ ప్రేమతో నేనెంతో సంతోషంగా ఉన్నాను" అంటూ కామెంట్ పోస్టు చేసింది. దీంతో ఆతియా, కేఎల్ రాహుల్ ప్రేమలో ఉన్నారంటూ ఈ మేరకు ఓ బాలీవుడ్ సైట్ కథనం ప్రచురించింది.
కరణ్ జోహార్ కార్యక్రమం వివాదంతో..
కాఫీ విత్ కరణ్ షోలో పాల్గొని మహిళలపై నోరు జారి... టీమిండియా క్రికెటర్లు హార్దిక్ పాండ్యా, కేఎల్ రాహుల్ చిక్కుల్లో పడ్డారు. దీంతో సీఓఏ నిరవధికంగా వీరిన సస్పెండ్ చేసింది. అప్పుడు ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే సిరీస్తో పాటు ఇప్పుడు జరుగుతున్న న్యూజిలాండ్ టూర్కి కూడా వాళ్లు దూరమయ్యారు. తమ వ్యాఖ్యలపై ఇద్దరూ సారీ చెప్పడంతో సస్పెన్షన్ ఎత్తి వేశారు.