Don't Miss!
- News 'ఓటుకు నోటు' కేసులో సుప్రీంకోర్టు కీలక నిర్ణయం
- Finance IT News: టెక్ కంపెనీల్లో అత్యధిక జీతం ఆయనకే.. దేశీయ ఐటీ కంపెనీల్లో రికార్డు..
- Technology ధర రూ.10 వేల కంటే తక్కువ ధరకే రియల్మి 5G స్మార్ట్ఫోన్.. లాంచ్, స్పెసిఫికేషన్ల పూర్తి వివరాలు..!!
- Sports ధోనీని ఒప్పించడం కష్టమే..ఆ ఫేక్ న్యూస్ నమ్మొద్దు- రోహిత్
- Lifestyle Marriage Day Wishes in Telugu : పెళ్లిరోజు శుభాకాంక్షల సందేశాలను ఇలా పంపండి..
- Automobiles జాన్ అబ్రహం మనసుదోచిన కొత్త బైక్ ఇదే!.. మీరూ చూడండి
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
ఆ ముగ్గురు హీరోయిన్లతో .. నటుడిగా దర్శకేంద్రుడి ఎంట్రీ!
దర్శకేంద్రుడు కే రాఘవేంద్రరావు ఒకప్పుడు మౌన ముని. ఎక్కువగా మాట్లాడేవారే కాదు. తన పని తాను చూసుకునేవారు. మితంగా మాట్లాడే వారు. కానీ ఇప్పుడు మాత్రం మైకు చేతికి అందితే దుమ్ముదులిపేస్తున్నారు. రాఘవేంద్ర రావు మాటల ప్రవాహాన్ని చూసి అందరూ షాక్ అవుతున్నారు. అలాంటి దర్శకేంద్రుడు తనలోని కొత్త కోణాన్ని మనకు పరిచయం చేసేందుకు రెడీ అవుతున్నారు.
దర్శకత్వాన్ని కూడా ఆపేసి సినిమాలకు దూరంగా ఉంటున్నారు. అలాంటి రాఘవేంద్రరావు ఇప్పుడు కెమెరా ముందుకొస్తున్నారు. ఓ నటుడిగా ఆయన తనలోని కొత్త కోణాన్నిచూపించబోతున్నారు. తనికెళ్ల భరణి దర్శకత్వంలో ఓ చిత్రం రూపుదిద్దుకోనుంది. ఇందులో కె.రాఘవేంద్రరావు ప్రధాన పాత్రను పోషించబోతోన్నారు. ఈ మూవీలో చిత్రంలో ముగ్గురు కథానాయికలు కనిపించనున్నారని సమాచారం.
ఆ పాత్రల్లో సమంత, శ్రియ, రమ్యకృష్ణలు కనిపించనున్నారని టాక్. సమంత, శ్రియలవి దాదాపుగా అతిథి పాత్రలు కాగా... రమ్యకృష్ణ పాత్ర మాత్రం పూర్తి నిడివితో సాగబోతోందని గుసగుసలు వినిపిస్తున్నాయి. 2021 లో ఈ చిత్రం పట్టాలెక్కుతుందని తెలుస్తోంది. ప్రస్తుతం స్క్రిప్టు పనులు జరుగుతున్నాయి. ఓ నవల ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కుతోందని ప్రచారం జరుగుతోంది. మరి వీటిలో నిజమెంతుందో తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే.