Don't Miss!
- News ఏప్రిల్ లో అంగారక యోగం: ఈ మూడు రాశుల వారికి ఆర్థిక నష్టాలు, ఊహించని కష్టాలు
- Sports RR vs DC: కన్నీటి పర్యంతమైన రియాన్ పరాగ్!
- Lifestyle Love Horoscope For April 2024:ఈ రాశులకి ఏప్రిల్ లో LOVE సక్సెస్ అవుతుంది..మరికొందరికి అడ్డంకులు తప్పవు
- Technology రియల్మి కొత్త ఫోన్ టీజర్ విడుదల.. సెగ్మెంట్లోనే సన్నని డిజైన్ సహా కీలక ఫీచర్లు..!
- Automobiles 6 కోట్ల కస్టమర్లతో భారత్లో హోండా తిరుగులేని రికార్డు.. ఎక్కువగా వీటిపైనే క్రేజ్.!!
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
ఆ ముగ్గురు హీరోయిన్లతో .. నటుడిగా దర్శకేంద్రుడి ఎంట్రీ!
దర్శకేంద్రుడు కే రాఘవేంద్రరావు ఒకప్పుడు మౌన ముని. ఎక్కువగా మాట్లాడేవారే కాదు. తన పని తాను చూసుకునేవారు. మితంగా మాట్లాడే వారు. కానీ ఇప్పుడు మాత్రం మైకు చేతికి అందితే దుమ్ముదులిపేస్తున్నారు. రాఘవేంద్ర రావు మాటల ప్రవాహాన్ని చూసి అందరూ షాక్ అవుతున్నారు. అలాంటి దర్శకేంద్రుడు తనలోని కొత్త కోణాన్ని మనకు పరిచయం చేసేందుకు రెడీ అవుతున్నారు.
దర్శకత్వాన్ని కూడా ఆపేసి సినిమాలకు దూరంగా ఉంటున్నారు. అలాంటి రాఘవేంద్రరావు ఇప్పుడు కెమెరా ముందుకొస్తున్నారు. ఓ నటుడిగా ఆయన తనలోని కొత్త కోణాన్నిచూపించబోతున్నారు. తనికెళ్ల భరణి దర్శకత్వంలో ఓ చిత్రం రూపుదిద్దుకోనుంది. ఇందులో కె.రాఘవేంద్రరావు ప్రధాన పాత్రను పోషించబోతోన్నారు. ఈ మూవీలో చిత్రంలో ముగ్గురు కథానాయికలు కనిపించనున్నారని సమాచారం.
ఆ పాత్రల్లో సమంత, శ్రియ, రమ్యకృష్ణలు కనిపించనున్నారని టాక్. సమంత, శ్రియలవి దాదాపుగా అతిథి పాత్రలు కాగా... రమ్యకృష్ణ పాత్ర మాత్రం పూర్తి నిడివితో సాగబోతోందని గుసగుసలు వినిపిస్తున్నాయి. 2021 లో ఈ చిత్రం పట్టాలెక్కుతుందని తెలుస్తోంది. ప్రస్తుతం స్క్రిప్టు పనులు జరుగుతున్నాయి. ఓ నవల ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కుతోందని ప్రచారం జరుగుతోంది. మరి వీటిలో నిజమెంతుందో తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే.