twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఆ ముగ్గురు హీరోయిన్లతో .. నటుడిగా దర్శకేంద్రుడి ఎంట్రీ!

    |

    దర్శకేంద్రుడు కే రాఘవేంద్రరావు ఒకప్పుడు మౌన ముని. ఎక్కువగా మాట్లాడేవారే కాదు. తన పని తాను చూసుకునేవారు. మితంగా మాట్లాడే వారు. కానీ ఇప్పుడు మాత్రం మైకు చేతికి అందితే దుమ్ముదులిపేస్తున్నారు. రాఘవేంద్ర రావు మాటల ప్రవాహాన్ని చూసి అందరూ షాక్ అవుతున్నారు. అలాంటి దర్శకేంద్రుడు తనలోని కొత్త కోణాన్ని మనకు పరిచయం చేసేందుకు రెడీ అవుతున్నారు.

    దర్శకత్వాన్ని కూడా ఆపేసి సినిమాలకు దూరంగా ఉంటున్నారు. అలాంటి రాఘ‌వేంద్ర‌రావు ఇప్పుడు కెమెరా ముందుకొస్తున్నారు. ఓ నటుడిగా ఆయ‌న త‌న‌లోని కొత్త కోణాన్నిచూపించ‌బోతున్నారు. త‌నికెళ్ల భ‌ర‌ణి ద‌ర్శ‌క‌త్వంలో ఓ చిత్రం రూపుదిద్దుకోనుంది. ఇందులో కె.రాఘ‌వేంద్ర‌రావు ప్ర‌ధాన పాత్ర‌ను పోషించబోతోన్నారు. ఈ మూవీలో చిత్రంలో ముగ్గురు క‌థానాయిక‌లు క‌నిపించ‌నున్నారని సమాచారం.

    K Raghavendra rao Debut As an Actor

    ఆ పాత్ర‌ల్లో స‌మంత‌, శ్రియ‌, ర‌మ్య‌కృష్ణ‌లు కనిపించనున్నారని టాక్‌. స‌మంత‌, శ్రియ‌ల‌వి దాదాపుగా అతిథి పాత్ర‌లు కాగా... ర‌మ్య‌కృష్ణ పాత్ర మాత్రం పూర్తి నిడివితో సాగ‌బోతోంద‌ని గుసగుసలు వినిపిస్తున్నాయి. 2021 లో ఈ చిత్రం ప‌ట్టాలెక్కుతుందని తెలుస్తోంది. ప్ర‌స్తుతం స్క్రిప్టు ప‌నులు జ‌రుగుతున్నాయి. ఓ న‌వ‌ల ఆధారంగా ఈ చిత్రం తెర‌కెక్కుతోంద‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. మరి వీటిలో నిజమెంతుందో తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే.

    English summary
    K Raghavendra rao Debut As an Actor, Tanikella Bharani Directs K Raghavendra rao
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X