Don't Miss!
- Sports T20 వరల్డ్ కప్కు భారత తుదిజట్టు ఇదే - సెహ్వాగ్
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- News రాజీనామాకు సిద్దం - కోమటిరెడ్డి వెంకటరెడ్డి..!!
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
- Automobiles సేఫ్టీలో మహీంద్రా బొలెరో నియోకు కేవలం 1-స్టార్ రేటింగ్.. దీనిపై కంపెనీ ఏమందంటే??
- Technology Realme నుంచి రెండు కొత్త ఫోన్లు లాంచ్ అయ్యాయి! ధర రూ.11,999 కే మొదలు
- Lifestyle వేసవిలో కడుపులో చల్లగా ఉంచే కీరకాయ పెరుగుపచ్చడి-అన్నం, రోటీ లేదా చపాతీ దేనికైనా...
కె విశ్వనాథ్ ఏ డైరక్టర్ ని టార్గెట్ చేసి మాట్లాడారు
కళాతపస్విగా చిరపరిచితమైన పద్మశ్రీ కాశీనాధుని విశ్వనాధ్ తెలుగు సినిమా దర్శకుడు. ప్రశస్తమైన సినిమాలను సృష్టించి, తెలుగు సినిమాకు ఒక గౌరవాన్ని, గుర్తింపును తెచ్చిన వ్యక్తి, కె.విశ్వనాథ్. ఆయన తీసే సినిమాలలో సంగీతానికి చాలా ప్రాముఖ్యత ఉంటుంది. విశ్వనాథ్ చిత్రాలంటే అన్ని వర్గాలవారు చూస్తారు. తెలుగు సినిమా ప్రతిష్టను దశదిశలా చాటిన దర్శకుడు కళాతపస్వి కె.విశ్వనాథ్. తెలుగువారు గర్వంగా చెప్పు కునే 'శంకరాభరణం', 'సాగరసంమం', 'స్వాతిముత్యం', 'స్వర్ణకమలం', 'స్వయంకృషి', 'శుభలేఖ' వంటి ఎన్నో కళాత్మక చిత్రాలను ఆయన అందించారు.
కళాతపస్వి కె. విశ్వనాథ్ ప్రస్తుతం అల్లరి నరేష్, మంజరి, జంటగా 'శుభప్రదం" చిత్రానికి దర్శకత్వం వహిస్తున్న విషయం విదితమే. నేటి తరం చిత్రాల గురించి ఆయన మాట్లాడుతూ 'నేటి తరం సినిమాలు జనాలకు నేర్పించే విధంగా లేవు. అమ్మాయిలను ఎలా ఏడిపించాలి? అబ్బాయిలు ఎలా ఆకతాయితనంగా ఉండాలి? అనే తరహా కథలతో చాలా సినిమాలు రూపొందుతున్నాయి. వీటివల్ల జనాలకు ఏం ఉపయోగం ఉంటుంది? అని విశ్వనాథ్ అంటున్నారు. ఇంతకీ విశ్వనాథ్ ఏ దర్శకుడిని టార్గెట్ చేసుకుని ఇలా మాట్లాడారో..?