Don't Miss!
- News వైసీపీకి బీఆర్ఎస్ గతే: గంటా శ్రీనివాసరావు సంచనల వ్యాఖ్యలు
- Sports LSG vs CSK: రప్ఫాడించిన రాహుల్... లక్నో ఘన విజయం
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
కె విశ్వనాథ్ ఏ డైరక్టర్ ని టార్గెట్ చేసి మాట్లాడారు
కళాతపస్విగా చిరపరిచితమైన పద్మశ్రీ కాశీనాధుని విశ్వనాధ్ తెలుగు సినిమా దర్శకుడు. ప్రశస్తమైన సినిమాలను సృష్టించి, తెలుగు సినిమాకు ఒక గౌరవాన్ని, గుర్తింపును తెచ్చిన వ్యక్తి, కె.విశ్వనాథ్. ఆయన తీసే సినిమాలలో సంగీతానికి చాలా ప్రాముఖ్యత ఉంటుంది. విశ్వనాథ్ చిత్రాలంటే అన్ని వర్గాలవారు చూస్తారు. తెలుగు సినిమా ప్రతిష్టను దశదిశలా చాటిన దర్శకుడు కళాతపస్వి కె.విశ్వనాథ్. తెలుగువారు గర్వంగా చెప్పు కునే 'శంకరాభరణం', 'సాగరసంమం', 'స్వాతిముత్యం', 'స్వర్ణకమలం', 'స్వయంకృషి', 'శుభలేఖ' వంటి ఎన్నో కళాత్మక చిత్రాలను ఆయన అందించారు.
కళాతపస్వి కె. విశ్వనాథ్ ప్రస్తుతం అల్లరి నరేష్, మంజరి, జంటగా 'శుభప్రదం" చిత్రానికి దర్శకత్వం వహిస్తున్న విషయం విదితమే. నేటి తరం చిత్రాల గురించి ఆయన మాట్లాడుతూ 'నేటి తరం సినిమాలు జనాలకు నేర్పించే విధంగా లేవు. అమ్మాయిలను ఎలా ఏడిపించాలి? అబ్బాయిలు ఎలా ఆకతాయితనంగా ఉండాలి? అనే తరహా కథలతో చాలా సినిమాలు రూపొందుతున్నాయి. వీటివల్ల జనాలకు ఏం ఉపయోగం ఉంటుంది? అని విశ్వనాథ్ అంటున్నారు. ఇంతకీ విశ్వనాథ్ ఏ దర్శకుడిని టార్గెట్ చేసుకుని ఇలా మాట్లాడారో..?