Don't Miss!
- Sports CSK vs LSG: అతని వల్లే గెలిచే మ్యాచ్లో ఓడాం: రుతురాజ్ గైక్వాడ్
- Lifestyle ఈ 4 రాశుల వారు ఉత్తమ సెక్స్ భాగస్వాములు అవుతారు... వీరిని లైఫ్ పార్ట్నర్ గా పొందడం అదృష్టం!
- News బాలకృష్ణకు షాక్: హిందూపురంలో నామినేషన్ వేసిన స్వామి పరిపూర్ణానంద
- Automobiles ఏథర్ రిజ్టా ఎలక్ట్రిక్ స్కూటర్కు పోటీగా ఆంపియర్ NXG.. ఆ రోజే లాంచ్
- Technology ధర రూ.10 వేల కంటే తక్కువ ధరకే రియల్మి 5G స్మార్ట్ఫోన్.. విడుదల తేదీ ఖరారు..!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
అవార్డుల ఫంక్షన్ లో రామ్ చరణ్ పరువు తీసిన కాజల్..!
అవార్డ్ ఫంక్షన్లకి హీరోయిన్లు రారని, వారికి షాప్ ఓపెనింగ్ లు, స్టేజీ షోలే ముఖ్యమని దాసరి నారాయణరావు కామెంట్ చేస్తే, దాసరిని తప్పుబట్టి 'ఆయన స్టేట్ మెంట్ కరెక్ట్ కాదు" అని రామ్ చరణ్ అన్నాడు. అవార్డుల వేడుకలకి హీరోయిన్లు వస్తున్నారని, ఫిలింఫేర్ అవార్డుల వేడుకలో దాదాపుగా మీరోయిన్లంతా హాజరయ్యారని చరణ్ పేర్కొన్నాడు.
అయితే అతను అలా అన్న కొద్ది రోజులకే మాటీవీ అవార్డుల ఫంక్షన్ కి కాజల్ అగర్వాల్ డుమ్మా కొట్టింది. ఏ అవార్డుల వేడుకైనా కానీ అవార్డు ఇస్తున్నారన్నప్పుడు దానికి మర్యాద ఇవ్వడం ఆర్టిస్టుల కర్తవ్యం, ఇది మాటీవీ అవార్డే కదా అని కాజల్ లైట్ తీసుకుంది. అదే ఇవి ఫిలింఫేర్ లేదా నంది అవార్డులైతే ఆమె రాకుండా ఉండేదా? ఇలాంటి అవార్డులని చులకనగా చూస్తున్నారనే దాసరి ఆ వేడుకలో అలా అన్నారు.
అవార్డులంటే ఫిలింఫేర్ మాత్రమే అనుకుంటున్న చరణ్ పూర్తి వివారాలు తెలీకుండా హీరోయిన్ల తరపున వకాల్తా పుచ్చుకున్నాడు. తీరా అతను హాజరయిన మాటీవీ అవార్డుల వేడుకకి కాజల్ హాజరు కాలేదు. దీంతో దాసరి వర్గానికి నోరొచ్చింది..ఇప్పుడేమంటావ్ అంటూ జోరుగా కామెంట్స్ వచ్చాయి..దాంతో చరణ్ పరువు కాస్తా గంగపాలైనట్లైంది..