Don't Miss!
- Finance Mutual Funds: ఆ కంపెనీల్లో వాటాను పెంచుకున్న మ్యూచువల్ ఫండ్స్..
- Sports IPL చరిత్రలో తొలిసారి.. రాహుల్-రుతురాజ్కు షాక్!
- News Rk Roja Margadarsi Chit: మార్గదర్శిలో రోజాకు చిట్! విలువెంతో తెలుసా?
- Travel శ్రీవారి భక్తులకు శుభవార్త.. ఐఆర్సిటిసి తిరుమల టూర్ ప్యాకేజీ...
- Automobiles కనీవినీ ఎరుగని డిస్కౌంట్స్!.. హ్యుందాయ్ కారు కొనటానికి ఇదే మంచి సమయం
- Technology ధర రూ.14999 కే 6000mAh బ్యాటరీ, 50MP కెమెరా శాంసంగ్ స్మార్ట్ఫోన్ కొత్త వేరియంట్ విడుదల..!!
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
తల్లి కావడానికి అన్ని కోట్లా?.. షాకిచ్చిన కాజల్.. అదే చివరి సినిమానట..
Recommended Video
లక్ష్మీ కల్యాణం చిత్రంతో టాలీవుడ్లోకి ప్రవేశించిన అందాలభామ కాజల్ అగర్వాల్ ఇటీవలే ఓ అరుదైన ఘనతను సొంతం చేసుకొన్నది. రానా దగ్గుబాటి నటించిన నేనే రాజు నేనే మంత్రి చిత్రంతో 50 చిత్రాలు పూర్తి చేసిన బ్యూటీగా పేరుతెచ్చుకొన్నది. త్వరలోనే నటనకు స్వస్తి చెప్పాలనుకొంటున్న కాజల్ ఇటీవల భారీ రెమ్యునరేషన్కు తల్లి పాత్రలో నటించడానికి సిద్ధమవుతున్నది. ఆ వివరాలు మీ కోసం..
కాజల్ అగర్వాల్ షాక్
నేనే రాజు నేనే మంత్రిలో అద్భుతమైన క్యారెక్టర్తో ఆకట్టుకొన్న కాజల్ అభిమానులకు షాకిచ్చింది. ప్యారిస్ ప్యారిస్, అ! చిత్రాల తర్వాత సినీ రంగానకిి గుడ్బై చెబుతానని ప్రకటించడంతో సినీ వర్గాలు షాక్ తిన్నారు. ఈ రెండు చిత్రాలు త్వరలో రిలీజ్ కానున్నాయి.
వెంకటేష్ సరసన కాజల్
కాజల్ను తనను తెలుగు తెరకు పరిచయం చేసిన దర్శకుడు తేజ ఇటీవల తన చిత్రంలో ఓ పాత్రలో నటించాలని ఆమెను సంప్రదించాలంటే. విక్టీరీ వెంకటేష్ నటించే చిత్రంలో తొలుత నటించడానికి ఆమె ఆ పాత్రను తిరస్కరించిందట. ఎందుకంటే ఆమె ఓ ఐదేళ్ల బాలుడికి తల్లిగా నటించాల్సి రావడమే.
4 కోట్ల రెమ్యునరేషన్
కాజల్ను ఆ పాత్రలో నటింప జేయడానికి చాలా రకాలుగా ప్రయత్నించారట. చివరికి భారీగా రెమ్యునరేషన్ ఆఫర్ చేయడంతో తన గురువు తేజకు ఓకే చెప్పిందట. తల్లిగా నటించడానికి రూ.4 కోట్ల రెమ్యునరేషన్ ఇచ్చినట్టు తెలిసింది. త్వరలోనే కాజల్ ఈ ప్రాజెక్ట్ అగ్రిమెంట్పై సంతకం చేసేందుకు సిద్ధమవుతున్నారనే తాజా సమాచారం.
మళ్లీ లెక్చరర్గా వెంకీ
నేనే రాజు నేనే మంత్రి సక్సెస్తో మళ్లీ పాత జోష్లో కనిపిస్తున్న దర్శకుడు తేజ.. ఆటా నాదే వేటా నాదే అనే చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఈ చిత్రంలో వెంకీ లెక్చరర్ పాత్రను పోషిస్తున్నారు. అయితే ఈ పాత్ర చాలా సీరియస్గా ఉంటుందని చెబుతున్నారు.
సుందరకాండ తర్వాత
సుందరకాండ తర్వాత వెంకీ మళ్లీ ఓ కాలేజీ లెక్చరర్గా కనిపించడం ఇదే మొదటిసారి. ఈ చిత్రం రివేంజ్ డ్రామాగా రూపొందనున్నది. ఈ చిత్రంలో కాజల్ది కీలకమైన పాత్ర అని చెబుతున్నారు. భావోద్వేగ సన్నివేశాలు ప్రేక్షకులను కట్టిపడేస్తాయనేది ప్రాథమిక సమాచారం.