Don't Miss!
- Finance HUL: రూ.24 డివిడెండ్ ప్రకటించిన హిందుస్థాన్ యూనిలీవర్..
- News వివేకా కేసులో మరో అనూహ్య ట్విస్ట్- విచారణ నుంచి తప్పుకున్న జడ్జి..!
- Automobiles కొత్త ఆస్టన్ మార్టిన్ వాంటేజ్ కూల్ స్పోర్ట్స్ కారు లాంచ్.. గంటకు 325 కి.మీ వేగం.. ధర, ఫీచర్లు ఇవే..
- Technology Nokia మాతృ సంస్థ HMD నుంచి మూడు కొత్త ఫోన్లు లాంచ్! ధర, స్పెసిఫికేషన్ల వివరాలు
- Sports సూపర్మ్యాన్ స్టబ్స్: మెరుపు ఫీల్డింగ్తో ఢిల్లీని గెలిపించాడు! Video
- Lifestyle పెళ్లైన వ్యక్తితో డేటింగా? కాస్త ముందు..వెనకా ఆలోచించండి..లేదంటే కొంప కొల్లేరే..!
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
కాజల్ సెన్సేషనల్ డెసిషన్.. టాలీవుడ్ హీరోకు చెల్లిగా.. ఆశ్చర్యపోతున్న ఫ్యాన్స్
కొద్దిరోజుల క్రితం వరకూ చేతి నిండా సినిమాలతో ఫుల్ బిజీగా గడిపింది టాలీవుడ్ చందమామ కాజల్. ఇప్పుడు మాత్రం దానికి భిన్నమైన పరిస్థితిని ఎదుర్కొంటోంది. ఒకవైపు హిట్లు లేక మరోవైపు అవకాశాలు రాక ఇబ్బంది పడుతోంది. ఉన్న సినిమాలేమో వివాదాస్పదం అవుతుండడం.. ఎంపికైన సినిమా నుంచి తప్పుకోవడం వంటి వాటితో కాజల్ ఇబ్బందులు పడుతోంది.
ఇలాంటి పరిస్థితుల్లో కాజల్ తాజాగా ఓ సినిమాకు సైన్ చేసిందనే టాక్ వినిపిస్తోంది. మంచు విష్ణు హీరోగా నటిస్తున్న చిత్రంలో ఈ బ్యూటీ కనిపించనుందని టాక్. ఇక్కడ షాకింగ్ న్యూస్ ఏంటంటే.. ఈ సినిమాలో కాజల్ హీరోయిన్గా కాదు.. విష్ణుకు చెల్లెలిగా నటించబోతుందని తెలిసింది. సిస్టర్ సెంటిమెంట్తో తెరకెక్కనున్న ఈ చిత్రం క్రైమ్ థ్రిల్లర్గా రూపొందుతుందని సమాచారం. ఈ సినిమా తెలుగుతో పాటు ఇంగ్లీష్లోనూ తెరకెక్కనుంది.
వరుస పరాజయాలతో సతమతమవుతున్న మంచు విష్ణు.. ఒకేసారి నాలుగు ప్రాజెక్టులకు పచ్చ జెండా ఊపిన విషయం తెలిసిందే. అందులో ఒకటి ఈ సినిమా. హాలీవుడ్ దర్శకుడు రూపొందించనున్న ఈ క్రైమ్ థ్రిల్లర్ సినిమా ఇంగ్లీష్, తెలుగు భాషల్లో ఒకేసారి విడుదల కానుంది. దీనికి సంబంధించిన షూటింగ్ త్వరలోనే ప్రారంభం అవుతుందని తెలుస్తోంది. మిగిలిన నటుల ఎంపిక కూడా పూర్తయిన తర్వాత పూర్తి వివరాలు వెల్లడిస్తారని సమాచారం.
మరోవైపు, బాలీవుడ్లో కంగనా నటించిన 'క్వీన్' ఎంతటి ఘన విజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అందుకే ఈ సినిమాను అన్ని భాషల్లో రీమేక్ చేయడానికి ప్రయత్నాలు చేశారు. ఇందులో భాగంగానే తమిళంలో కాజల్ మెయిన్ లీడ్గా 'ప్యారిస్ ప్యారిస్' టైటిల్తో తెరకెక్కింది. మీడియంట్ ఫిలిం పతాకంపై మనుకుమార్ వీటిని నిర్మించారు. మిగిలిన భాషల్లో రాని విధంగా ఈ సినిమాకు మాత్రం సెన్సార్ బోర్డు 'ఏ' సర్టిఫికెట్ జారీ చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన వివాదం నడుస్తోంది.