Don't Miss!
- Sports RR vs DC: కన్నీటి పర్యంతమైన రియాన్ పరాగ్!
- News గ్యాంగ్స్టర్, రాజకీయ నేత ముఖ్తార్ అన్సారీ గుండెపోటుతో మృతి
- Lifestyle Love Horoscope For April 2024:ఈ రాశులకి ఏప్రిల్ లో LOVE సక్సెస్ అవుతుంది..మరికొందరికి అడ్డంకులు తప్పవు
- Technology రియల్మి కొత్త ఫోన్ టీజర్ విడుదల.. సెగ్మెంట్లోనే సన్నని డిజైన్ సహా కీలక ఫీచర్లు..!
- Automobiles 6 కోట్ల కస్టమర్లతో భారత్లో హోండా తిరుగులేని రికార్డు.. ఎక్కువగా వీటిపైనే క్రేజ్.!!
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
ఆ హీరో చిత్రంలో కాజల్ గెస్ట్ రోల్ చేయటానికి కమిటైంది
మగధీర తర్వాత తిరుగులేని హీరోయిన్ గా ఎదిగిన కాజల్ ఇప్పుడు తమ సినిమాలో లక్కీ స్టార్ గా మారింది. తమ సినిమాలో అలా వచ్చి కనపడినా చాలు అనే నిర్ణయానకి వచ్చి ఆమెను సంప్రదిస్తున్నారు దర్శక, నిర్మాతలు. తాజాగా కృష్ణవంశీ దర్శకత్వంలో రూపొందుతున్న మొగుడు చిత్రంలో ఆమెను గెస్ట్ రోల్ కి ఒప్పించినట్లు సమాచారం. మొదట ఈ చిత్రంలో ఆమెను హీరోయిన్ గా అడిగారు.కానీ ఆమె బిజీగా ఉండటంతో ఆమె ఒప్పుకోలేదు. దాంతో ఆమెను కనీసం గెస్ట్ గా అయినా చేయమని రిక్వెస్ట్ చేసి ఒప్పించినట్లు చెప్పుకుంటున్నారు. ఇక ఇంతకుముందు కాజల్...కృష్ణ వంశీ దర్శకత్వంలో చందమామ సినిమాలో నవదీప్ సరసన చేసింది. ఇక మొగడు చిత్రంలో గోపీచంద్ హీరో కాగా తాప్సీ హీరోయిన్ గా చేస్తోంది. సాక్షి గులాటి(అప్పలరాజు ఫేం) మరో హీరోయిన్ గా చేస్తోంది. నల్లమలపు బుజ్జి నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ మొదలైంది. రీసెంట్ గా నల్లమలుపు బుజ్జి..నేను నా రాక్షసి చిత్రాన్ని పూరీ జగన్నాధ్ దర్శకత్వంలో రూపొందించారు. ఆ చిత్రం భాక్సాఫీస్ వద్ద ఫెయిల్యూర్ టాక్ వచ్చింది.