Don't Miss!
- News పవన్ కళ్యాణ్ను మెచ్చుకున్న చంద్రబాబు
- Lifestyle 56 ఏళ్లుగా ఎవరికీ కనిపించకుండా ఇంట్లోనే దాక్కున్న ఓ రహస్య వ్యక్తి... ఆడవాళ్లంటే వింత భయం..!
- Sports 89 రన్స్ కాపాడుకోవాలంటే..ఆ అద్భుతం జరగాలి!- గిల్
- Automobiles త్వరలో మేడ్ ఇన్ ఇండియా బుల్లెట్ ట్రైన్స్.. ఇక ప్రపంచ దేశాలన్నీ భారత్ వైపు చూడాల్సిందే.!!
- Travel సిక్కింలోని యుమ్తంగ్ వ్యాలీ వేసవిలో సందర్శనకు ఉత్తమం..
- Technology iPhone 16 Pro కెమెరా ఫీచర్లు లీక్! కొత్తగా Anti-Reflective టెక్నాలజీ రానుంది
- Finance ఆ కంపెనీ కొనే రేసులో టాటాలు, అంబానీ, రాధాకిషన్ దమానీ..!! పూర్తి వివరాలు..
కళ్యాణ్ రామ్కు ఝలక్.. అందుకు కోన వెంకట్ కారణమట!
నందమూరి హీరో కళ్యాణ్ రామ్ ఈ మధ్య ఏంఎల్ఏ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడం జరిగింది. ఈ సినిమా తరువాత నా నువ్వే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. తాజా సమాచారం మేరకు కళ్యాణ్ రామ్ కొత్త సినిమా ఆగిపోయినట్లు తెలుస్తోంది. నా నువ్వే తర్వాత కోన వెంకట్ చేప్పిన కథతో సినిమా చేయల్సి ఉంది. కానీ ఆ ప్రాజెక్ట్ను నిలిపివేసినట్టు సమాచారం. వివరాల్లోకి వెళ్ళితే...
కళ్యాణ్ రామ్ ప్రేమకథ..
కళ్యాణ్ రామ్ ఏంఎల్ఏ సినిమాతో సక్సెస్ చేజిక్కించుకొన్నాడు. అదే ఊపుతో నా నువ్వే సినిమాను ప్రేక్షకుల ముందుకు తెచ్చే ప్రయత్నం చేస్తున్నాడు కళ్యాణ్ రామ్. తమన్నా హీరోయిన్ గా నటించిన ఈ మూవీ ప్యూర్ లవ్ స్టోరిగా రూపొందించబడిందని సమాచారం. ఇటీవల విడుదలైన ఈ సినిమా టీజర్ ఇప్పటికే ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నది.
కోనా కథ నచ్చలేదు..
నా నువ్వే తర్వాత విజయ్ అనే దర్శకుడితో కళ్యాణ్ రామ్ సినిమా చెయ్యాలని అనుకున్నాడు. ఆ సినిమాకు కథ, మాటలు కోనా వెంకట్. కానీ కోన వెంకట్ చెప్పిన పాయింట్ కళ్యాణ్ రామ్ కు నచ్చకపోవడంతో ఆ సినిమా మొదలు కాలేదని సమాచారం. భవిషత్తులో ఈ మూవీ మొదలయ్యే అవకాశాలు లేవని తెలుస్తోంది. దాంతోనే గుహన్ సినిమాను ముందుకు తెచ్చినట్టు సినీ వర్గాలు చెప్పుకొంటున్నాయి.
గుహన్ తో సినిమా...
తాజాగా కళ్యాణ్ రామ్ కొత్త సినిమాను ప్రారంభించడం జరిగింది. కెమెరామెన్ గుహన్ ఈ సినిమాతో దర్శకుడిగా మారబోతుండడం విశేషం. నివేదా థామస్, శాలిని పాండే ఈ సినిమాలో హీరోయిన్స్ గా నటిస్తున్నారు. థ్రిల్లర్ నేపధ్యంలో ఈ సినిమా రూపొందించబడడం విశేషం.
సక్సెస్ ఫుల్ హీరోయిన్స్
వరుస విజయాలను అందుకుంటున్న నివేదా థామస్ నాని తో కలిసి నిన్ను కోరి సినిమాలో నటించి మంచి మార్కులు కొట్టేసింది. అర్జున్ రెడ్డి సినిమాతో ఒక్కసారిగా పాపులర్ అయిన శాలిని పాండే కళ్యాణ్ రామ్ సరసన మొదటిసారి నటిస్తోంది. ఇద్దరు సక్సెస్ ఫుల్ హీరోయిన్స్ కళ్యాణ్ రామ్, గుహన్ సినిమాలో నటించడం విశేషం.