Don't Miss!
- Technology రియల్మి కొత్త ఫోన్ టీజర్ విడుదల.. సెగ్మెంట్లోనే సన్నని డిజైన్ సహా కీలక ఫీచర్లు..!
- News తెలంగాణ జెన్కో, ఏఈ, కెమిస్ట్ ఉద్యోగ పరీక్ష వాయిదా
- Sports Tilak Varma:అతని కోసమే ఆ సంబరాలు! వీడియో
- Automobiles 6 కోట్ల కస్టమర్లతో భారత్లో హోండా తిరుగులేని రికార్డు.. ఎక్కువగా వీటిపైనే క్రేజ్.!!
- Lifestyle First Surya Grahan: ఏప్రిల్ నెలలో మొదటి సూర్య గ్రహణం ఎప్పుడు? సూతక కాలం
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
మెగాస్టార్ రికార్డుపై ఎన్టీఆర్ గురి.. డిస్టిబ్యూటర్లకు నష్టాలు.. ఆదుకోవడానికి కల్యాణ్ రామ్ రెడీ!
Recommended Video
టాలీవుడ్లో సూపర్ హిట్ టాక్ వచ్చినా గానీ డిస్టిబ్యూటర్లు లాభాల దారిని పట్టడం లేదు. ఇలాంటి సంఘటనలు ఇటీవల తెలుగు సినీ పరిశ్రమలో ఎక్కువగానే కనిపిస్తున్నాయి. తాజాగా జై లవకుశ విషయంలోనూ అదే జరిగింది. అందుకు కారణం భారీ రేట్లకు సినిమా పంపిణీ హక్కులను అమ్మడమే అనే మాట వినిపిస్తున్నది. దాంతో నష్టాల పాలైన పంపిణీదారులను ఆదుకోవాలని నిర్మాత కల్యాణ్ రామ్ నిర్ణయం తీసుకొన్నట్టు వార్తలు వెలువడుతున్నాయి.
80 కోట్ల షేర్
జై లవకుశ చిత్రం ఓవరాల్గా సుమారు 80 కోట్ల షేర్ (నికరం) రాబట్టే అవకాశం ఉన్నట్టు సమాచారం. అయితే ఈ చిత్ర పంపిణీ హక్కులను 86 కోట్లకు అమ్మినట్టు ట్రేడ్ వర్గాలు వెల్లడిస్తున్నారు. అయితే పంపిణీదారులకు పెట్టిన పెట్టుబడి రావాలంటే ఇంకా 6 కోట్లు కలెక్ట్ చేయాల్సిందే.
కల్యాణ్ రామ్ నిర్ణయం
ఈ నేపథ్యంలో పంపిణీదారులు నష్టాన్ని పూడ్చేందుకు డిస్ట్రిబ్యూషన్ రైట్స్ కింద తీసుకొన్న మొత్తంలో నుంచి కొంత మొత్తాన్ని తిరిగి ఇవ్వాలని కల్యాణ్ రామ్ నిర్ణయించుకొన్నట్టు తెలుస్తున్నది. అయితే అధికారికంగా ఎలాంటి ప్రకటన మీడియాలో రాకపోవడం గమనార్హం. ఈ విషయంలో కల్యాణ్ రామ్ నిర్ణయం కరెక్ట్ కాదా అనేది త్వరలోనే తెలిసే అవకాశం ఉంది.
దిల్ రాజుకు 3 కోట్లు
నైజాంలో జై లవకుశ చిత్రాన్ని పంపిణీ చేసిన ప్రముఖ నిర్మాతకు రూ.3 కోట్లు చెల్లించేందుకు కల్యాణ్ రామ్ సిద్ధమవుతున్నాడట. ఇక మిగితా డిస్టిబ్యూటర్ల కూడా నష్టాల్ని సెటిల్ చేయడానికి చర్యలు తీసుకొంటున్నట్టు సమాచారం. ఇదే నిజమైతే కల్యాణ్ రాంను అభినందించక తప్పదు అంటున్నారు సినీ వర్గాలు.
మెగాస్టార్ రికార్డుపై ఎన్టీఆర్ గురి
ఇక మెగాస్టార్ చిరంజీవి రీ ఎంట్రీ మూవీ ఖైదీ నంబర్ 150 చిత్రం క్రియేట్ చేసిన 164 కోట్ల గ్రాస్ కలెక్షన్ల రికార్డును అధిగమించేందుకు జై లవకుశ పరుగులు పెడుతున్నది. ట్రేడ్ అనలిస్టుల ప్రకారం ఇటీవల శ్రీమంతుడు రికార్డును కూడా తుడిచేసినట్టు తెలుస్తున్నది. ఓవరాల్గా ఇప్పటి వరకు జై లవకుశ 162 కోట్లు వసూలు చేసినట్టు సమాచారం.