Don't Miss!
- Automobiles 5 రూపాయల గొడవ.. చిర్రెత్తి సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ప్రయాణికుడు.. అసలేం జరిగిందంటే.!!
- News తెలంగాణలో నామినేషన్లను దాఖలు చేసిన బీజేపీ ఎంపీ అభ్యర్థులు వీరే
- Technology Samsung నుంచి కొత్త 8K మరియు 4K AI టీవీ లు లాంచ్ అయ్యాయి! ధర, ఫీచర్లు, ఆఫర్లు
- Sports IPL 2024: ఆ తెలుగు టీమ్ సాంగ్ ముందు ఏది పనికి రాదు: రోహిత్ శర్మ వీడియో
- Lifestyle Happy Birthday Wishes : పుట్టినరోజు శుభాకాంక్షలను ఇలా అందంగా తెలపండి..
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
కమల్ ఎంట్రీతో వివాదం పరిష్కారమైంది.. ముహూర్తం కూడా ఫిక్స్ చేసేశారు
తెలుగు సినీ చరిత్రలోనే చెప్పుకోదగిన సినిమాల్లో 'భారతీయుడు' ఒకటి. దీనికి కారణం అప్పట్లో భారతదేశంలో ఉన్న అవినీతిని కళ్లకు కట్టినట్లు చూపించడమే. ఈ సినిమా లంచం తీసుకునే అధికారులు.. వాళ్లను ప్రోత్సహించే నాయకులు, ప్రజలపై అస్త్రాలు ఎక్కుపెట్టింది. అందుకే ఈ సినిమా సంచలన విజయం సాధించింది.
ఇంతటి గొప్ప సినిమాకు సీక్వెల్ చేయాలని శంకర్- కమల్ ఎప్పటి నుంచో ప్రయత్నాలు చేశారు. దీనికి తగినట్లుగానే 'భారతీయుడు- 2' సినిమాను పోయిన ఏడాది మొదలుపెట్టారు. కమల్ హాసన్ కూడా కొన్ని రోజులు షూటింగ్లో పాల్గొన్నాడు. అయితే బడ్జెట్ విషయంలో విభేదాలు రావడంతో నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ ప్రాజెక్ట్ను నిలిపివేసింది.
బడ్జెట్ గురించి వచ్చిన విబేధాల వల్లే 'భారతీయుడు- 2' ఆగిపోయిందన్న విషయం అందరికీ తెలిసిందే. ఈ సినిమా నిలిచిపోయిన తర్వాత శంకర్.. లైకా ప్రొడక్షన్ మధ్య విభేదాలు తారాస్థాయికి వెళ్లాయట. అయితే, కమల్ ఈ మధ్య ఇరువురితో వేరు వేరుగా సమావేశం అయినట్లు తెలిసింది. బడ్జెట్ విషయంలో ఇటు శంకర్తోనూ.. అటు నిర్మాణ సంస్థతోనూ ఆయన చేసిన సంప్రదింపులు సఫలం అయ్యాయట. ఈ కారణంగానే 'భారతీయుడు- 2' షూటింగ్ ప్రారంభమైంది.
ప్రస్తుతం రాజమహేంద్రవరం పరిసర ప్రాంతాల్లో ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది. ఇందులో కాజల్, రకుల్ ప్రీత్ సింగ్, సిద్ధార్థ్, ప్రియా భవానీ శంకర్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని 2021 ఏప్రిల్ 14న తమిళ సంవత్సరాది సందర్భంగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని చిత్ర యూనిట్ భావిస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం 'బిగ్ బాస్' తమిళం సీజన్ -3కి హోస్ట్గా ఉన్న కమల్.. చిత్ర షూటింగ్లోనూ పాలు పంచుకుంటున్నాడు. ఈ సినిమాలో తెలుగు కమెడియన్ వెన్నెల కిశోర్ కీలక పాత్రలో నటిస్తున్నాడు.