Don't Miss!
- Sports PBKS vs MI: ఆ తప్పిదంతోనే గెలిచే మ్యాచ్లో ఓడాం: సామ్ కరణ్
- News పొన్నూరు వైసీపీ అభ్యర్థి అంబటి మురళీపై చర్యలకు ఈసీ ఆదేశం
- Lifestyle గుడ్నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Technology 40 గంటలకు పైగా బ్యాటరీ బ్యాకప్, ChatGPT వాయిస్ AI సపోర్టుతో నథింగ్ ఇయర్బడ్స్ విడుదల.. సేల్ వివరాలు!
- Automobiles గొప్ప మనసు చాటుకున్న రాఘవ లారెన్స్.. దివ్యాంగులకు టీవీఎస్ స్కూటర్ల పంపిణీ
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
కమల్ కీలక నిర్ణయం.. ఆనందంలో చరణ్ ఫ్యాన్స్.. ఇక లైన్ క్లియర్!
సుమారు 20 ఏళ్ల క్రితం తెరకెక్కించిన భారతీయుడు సినిమాకి దర్శకుడు శంకర్ ఇప్పుడు సీక్వెల్ చేస్తున్న సంగతి తెలిసిందే. కమల్ హాసన్ హీరోగా తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ క్రేన్ ప్రమాదం కారణంగా నిలిచిపోయింది. క్రేన్ ప్రమాదం జరిగిన సమయంలో శంకర్ కూడా గాయపడటంతో కొన్ని రోజుల పాటు హాస్పిటల్ లో చికిత్స తీసుకున్నారు.
ఆయన కోలుకున్నాక షూటింగ్ మొదలవుతుంది అనుకుంటే ఆ షూటింగ్ మొదలు కాలేదు. చివరికి లైకా ప్రొడక్షన్స్ - శంకర్ మధ్య విభేదాలు నెలకొనడం, అవి కోర్టు కేసులు దాకా వెళ్లిన సంగతి తెలిసిందే.. అయితే ఈ విషయంలో తాజాగా ఒక అప్డేట్ వచ్చింది ఆ వివరాల్లోకి వెళితే
సూపర్ హిట్ సినిమా సీక్వెల్
భారత దేశ వ్యాప్తంగా చెప్పుకోదగ్గ దర్శకులలో ఒకరైన శంకర్ సుమారు 20 ఏళ్ల క్రితం తాను తీసిన భారతీయుడు సినిమాకి సీక్వెల్ చేస్తున్నారు. కమల్ హాసన్ హీరోగా తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ కొద్ది నెలల క్రితం క్రేన్ ఆక్సిడెంట్ కారణంగా నిలిచిపోయింది. ఆ తర్వాత దేశంలో కరోనా ఎంటర్ కావడంతో షూటింగ్ లేని పరిస్థితి. ఇక ఆ తర్వాత జరుగుతుంది అనుకున్న సమయంలో కమల్ హాసన్ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు.
షూట్ మొదలుపెట్టాలని చూసినా
కరోనా తర్వాత కాస్త పరిస్థితి కుదుటపడింది అందరూ షూటింగ్ మొదలు పెడుతున్నారు అని ఈ సినిమా షూటింగ్ కూడా మొదలు పెట్టాలని శంకర్ భావించారు..అనూహ్యంగా కమలహాసన్ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వడంతో ఆయన ఎన్నికల కోసం బిజీబిజీగా గడపడం, ప్రచారం కోసం ఎక్కడెక్కడికో వెళ్ళడంతో సినిమా షూటింగ్ జరపలేని పరిస్థితి. దీంతో ఈ విషయం గురించి శంకర్ నిర్మాతలను కూడా సంప్రదించాడు. అయితే వాళ్లు అప్పుడు ఏమీ స్పందించలేదు. ఈ నేపధ్యంలోనే శంకర్ రామ్ చరణ్ తో సినిమా మొదలు పెట్టేందుకు గాను అధికారిక ప్రకటన కూడా చేశాడు.
చరణ్ - శంకర్ సినిమా ప్రకటన
దిల్ రాజు రామ్ చరణ్ శంకర్ కాంబినేషన్ లో ఒక సినిమా రూపొందిస్తున్నాం అంటూ దిల్ రాజు సంస్థ ప్రకటించింది.. భారీ బడ్జెట్ తో శంకర్ ర్ ఈ సినిమా రూపొందిస్తారని ప్రకటనలో పేర్కొన్నారు. అయితే ఈ ప్రకటన వచ్చే వరకు ఏమీ స్పందించని లేక ప్రొడక్షన్స్ సంస్థ, మా సినిమా పూర్తి చేయకుండా ఈ సినిమా ఎలా చేస్తారు అంటూ శంకర్ కు నోటీసులు పంపారు. ఇంత జరుగుతున్నా సరే కమల్ హాసన్ ఏమీ స్పందించలేదు. దీంతో ఈ సినిమా మీద సందిగ్ధత నెలకొంది.
కమలే కారణం
అయితే
ఈ
వివాదానికి
కారణం
కమలహాసన్
అని
కొందరు
అంటున్నారు.
దానికి
కారణం
క్రేన్
ప్రమాదం
తర్వాత
సినిమా
షూటింగ్
మొదలు
కాకపోవడానికి
కమల్
హాసన్
శైలి
కారణమని
చెబుతున్నారు..
ఈ
సినిమా
షూటింగ్
గురించి
ఆలోచించకుండా
బిగ్
బాస్
షూటింగ్
కు
హాజరు
కావడం,
ఆ
వెంటనే
లోకేష్
కనకరాజు
దర్శకత్వంలో
విక్రమ్
అనే
సినిమా
ప్రారంభించారు
ఆయన.
ఇక
ఆ
తర్వాత
రాజకీయాల్లో
బిజీ
అయ్యారు.
కానీ
రాజకీయాల్లో
ఆయనకు
ఆయన
పార్టీ
ఒక్క
సీటు
కూడా
సాధించలేక
పోయిన
నేపథ్యంలో
మళ్లీ
కమల్
సినిమాల
మీద
దృష్టి
పెడుతున్నట్లు
సమాచారం.
రంగంలోకి కమల్
స్వయంగా
తానే
శంకర్
లైక్
ప్రొడక్షన్
సంస్థ
వారితో
కూర్చుని
మాట్లాడి
సినిమా
మొదలు
పెట్టేందుకు
ప్రయత్నాలు
చేస్తున్నట్లు
సమాచారం..
ఇప్పటికే
180
కోట్ల
దాకా
ఖర్చు
పెట్టిన
సినిమాను
ఇప్పుడు
అర్ధాంతరంగా
ఆపేయడం
సరి
కాదని
భావించిన
ఆయన
ఈ
మేరకు
చొరవ
తీసుకుంటున్నారని
అంటున్నారు.
వీలైనంత
త్వరగా
ఈ
సినిమా
షూటింగ్
మళ్ళీ
మొదలు
పెట్టే
అవకాశాలు
ఉన్నాయని
అంటున్నారు.
అదే జరిగితే లైన్ క్లియర్
ఇక
ఈ
సినిమా
కనుక
ప్రారంభిస్తే
రామ్
చరణ్
శంకర్
సినిమాకి
ఉన్న
అడ్డంకులు
కూడా
తొలగిపోతాయి.
ఇప్పటిదాకా
రామ్
చరణ్
శంకర్
సినిమాకు
ఇండియన్
2
నిర్మాతల
నుంచి
ఏమైనా
అడ్డంకులు
వస్తాయి
ఏమో
అని
భయపడుతున్న
ఫ్యాన్స్
కి
ఇది
ఒక
రకంగా
ఊరట
కలిగించే
వార్త
అని
చెప్పాలి.
వీలైనంత
త్వరగా
ఇండియన్
2
షూటింగ్
పూర్తి
చేసి
అప్పుడు
శంకర్
రామ్
చరణ్
సినిమా
మీద
దృష్టి
పెట్టే
అవకాశాలు
కనిపిస్తున్నాయి.