Don't Miss!
- News పవన్ కళ్యాణ్ను మెచ్చుకున్న చంద్రబాబు
- Lifestyle 56 ఏళ్లుగా ఎవరికీ కనిపించకుండా ఇంట్లోనే దాక్కున్న ఓ రహస్య వ్యక్తి... ఆడవాళ్లంటే వింత భయం..!
- Sports 89 రన్స్ కాపాడుకోవాలంటే..ఆ అద్భుతం జరగాలి!- గిల్
- Automobiles త్వరలో మేడ్ ఇన్ ఇండియా బుల్లెట్ ట్రైన్స్.. ఇక ప్రపంచ దేశాలన్నీ భారత్ వైపు చూడాల్సిందే.!!
- Travel సిక్కింలోని యుమ్తంగ్ వ్యాలీ వేసవిలో సందర్శనకు ఉత్తమం..
- Technology iPhone 16 Pro కెమెరా ఫీచర్లు లీక్! కొత్తగా Anti-Reflective టెక్నాలజీ రానుంది
- Finance ఆ కంపెనీ కొనే రేసులో టాటాలు, అంబానీ, రాధాకిషన్ దమానీ..!! పూర్తి వివరాలు..
వెంకటేష్ పై మండిపడుతున్న కమిలినీ ముఖర్జీ
"నాగవల్లి ది రిటన్ ఆఫ్ చంద్రముఖి" చిత్రంలో చేసిన కమిలినీ ముఖర్జీ ఆ చిత్ర హీరో వెంకటేష్ పై పీకల దాకా కోపంతో మండిపడుతోందని ఫిల్మ్ సర్కిల్స్ లో వినపడుతోంది. వారు చెప్పుకునేదాని ప్రకారం..నాగవల్లి లో మొదట కమిలిని క్యారెక్టర్ ఫుల్ లెంగ్త్ ఉంటుందిట. అయితే సినిమా ఎడిటింగ్ పూర్తై చూసే సరికి ఆ పాత్ర చాలా భాగం తగ్గిపోయిందిట. కేవలం తన పాత్ర పెద్దదనే గుంపులో గోవిందంలా కలిసిపోననే నమ్మకంతోనే వెంకటేష్ ఇచ్చిన హామీ మేరకు ఆమె మెయిన్ హీరోయిన్ కాకపోయినా ఈ చిత్రంతో చేసింది. అయితే ఇప్పుడు జరిగిన ఈ పరిణామానికి ఆమె వెంకటేష్ దే భాధ్యత అంటోంది. తన పాత్ర రిచా, శ్రద్దాదాస్ ల మాదిరిగా కుచించుకుపోవటాన్ని ఆమె భరించలేకపోతోంది. ఈ విషయమై వెంకటేష్ ని సంప్రదిస్తే..దర్సకుడుతో మాట్లాడి చెప్తానని చెప్పారుట. అందుకే ఆమె నాగవల్లి ఆడియో పంక్షన్ కూడా రాలేదని తెలుస్తోంది. ఇదిలా ఉంటే ఆమె తాజా మళయాళ చిత్రంలో కూడా ఆమెకు అన్యాయం జరిగింది. మళయాళ చిత్రం కుట్టి శ్రాంక్ లో తన ప్రమేయం లేకుండా డూప్ ని పెట్టి నగ్నంగా ఉండే సీన్స్ తీసి ఆమెను రోడ్డుపై పెట్టాడు దర్సకుడు. ఇప్పుడు ఇంటర్నెట్ నిండా ఆ సీన్స్ దర్శనమిస్తున్నాయి. ప్రస్తుతం కమిలినీ ముఖర్జీ..సిఐడీ మూస (మళయాళ) రీమేక్ లో చేస్తోంది. వేణు హీరోగా చేస్తున్న ఈ చిత్రం పూర్తి స్ధాయి ఎంటర్టైనర్మెంట్ అని తెలుస్తోంది.