Don't Miss!
- News ఐటీ హబ్ లో హైఅలర్ట్, దెబ్బకు అన్ని కంపెనీలకు సెలవు, ఓటు సరే పెళ్లామ్ తో జంప్!
- Sports మా పక్కింటి ఆంటీ గొడవ వల్ల క్రికెటర్ను అయ్యాను: నితీశ్ కుమార్ రెడ్డి వీడియో
- Technology OnePlus Watch 2 వన్ప్లస్ వాచ్ 2 కొత్త వేరియంట్ విడుదల.. ధర, సేల్ పూర్తి వివరాలు..!
- Lifestyle పాలలో తామరవిత్తనాలు కలుపుకొని తాగితే ఇన్ని ప్రయోజనాలుంటాయా..?
- Finance Jio Cinema Premium: నెలకు 29లతో జియో ప్రీమియం..
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
ఎన్టీఆర్ బిహేవియర్ కి షాక్ అయిన కార్తీక
జూ ఎన్టీఆర్ తాజా చిత్రం దమ్ములో కార్తిక సెకెండ్ హీరోయిన్ గా చేస్తున్న సంగతి తెలిసిందే.బోయపాటి శ్రీను దర్శకత్వంలో కె ఎస్ రామారావు నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ చిత్రం సెట్స్ పై కార్తీక ఆశ్చర్యపోయే సంఘటన ఒకటి చోటు చేసుకుంది. ఆమెను మొదటి రోజు రిసీవ్ చేసుకున్న ఎన్టీఆర్ ఆమె దగ్గరకు వెళ్లి.. నాకు మీ అమ్మగారు రాధ అంటే చాలా గౌరవం, ఇష్టం. ఆమెతో చేద్దామనుకున్నాను కానీ కుదరలేదు.కానీ ఆవిడ కూతురైన మీతో చేయటం చాలా ఆనందంగా ఉంది అంటూ ఆమెతో చెప్పాడు. దాంతో కార్తిక షాక్ కి గురైంది. ఆమె కెరిర్ లో ఎప్పుడూ హీరో నుంచి ఇలాంటి మాటలు ఎప్పుడూ ఎక్సపెక్ట్ చేయలేదు. ఇంత గౌరవంగా తనను రిసీవ్ చేసుకుంటాడని భావించని ఆమె తన సర్కిల్స్ లో ఎన్టీఆర్ ఎంత గొప్పవాడో, అతని ప్రెడ్లీ నేచర్ ఎలాంటిదో చెప్తోంది.
ఇదే ఇప్పుడు ఫిల్మ్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ అయ్యింది. ఇక ఈ చిత్రంలో మెయిన్ హీరోయిన్ గా త్రిష చేస్తోంది. ఈ చిత్రం ఎమోషన్ తో కూడిన యాక్షన్ ఎంటర్టైనర్ గా బోయపాటి అభివర్ణిస్తున్నారు. ఈ చిత్రం సింహా కన్నా ఎక్కువ హిట్ అవుతుందని ఎన్టీఆర్ భావిస్తున్నారు. ఊసరవెల్లి మిగిల్చిన నిరాశను ఈ చిత్రం పాలద్రోలుతుందని అనుకుంటున్నారు. ఇక ఈ చిత్రంపై బోయపాటి సైతం హార్డ్ వర్క్ చేస్తున్నారు. ఈ సినిమా హిట్ కొడితే నెక్ట్స్ యంగ్ హీరోలతో కంటిన్యూగ్ ఆఫర్స్ పొందవచ్చునని భావిస్తున్నాడు. ఎన్టీఆర్ తల్లిగా ఈ సినిమాలో భానుప్రియ బావ క్యారక్టర్ కు హీరో వేణును ఎంపిక చేసారు. ఇక తాత క్యారక్టర్ కు కోట శ్రీనివాసరావు కన్ ఫార్మ్ అయ్యారని తెలుస్తుంది.