Don't Miss!
- News ఐటీ హబ్ లో హైఅలర్ట్, దెబ్బకు అన్ని కంపెనీలకు సెలవు, ఓటు సరే పెళ్లామ్ తో జంప్!
- Sports మా పక్కింటి ఆంటీ గొడవ వల్ల క్రికెటర్ను అయ్యాను: నితీశ్ కుమార్ రెడ్డి వీడియో
- Technology OnePlus Watch 2 వన్ప్లస్ వాచ్ 2 కొత్త వేరియంట్ విడుదల.. ధర, సేల్ పూర్తి వివరాలు..!
- Lifestyle పాలలో తామరవిత్తనాలు కలుపుకొని తాగితే ఇన్ని ప్రయోజనాలుంటాయా..?
- Finance Jio Cinema Premium: నెలకు 29లతో జియో ప్రీమియం..
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
కత్రినా కైఫ్ యవ్వారం నచ్చడంలేదు: ఐశ్వర్య రాయ్
పెళ్లాం చెబితే వినాలి. ఈ మాట అంటున్నది ఎవరోకాదండీ...అభిషేక్ బచ్చన్...తన భార్య చెప్పినట్లు నడుచుకుంటూ ఆచితూచి అడుగులేస్తున్నాడు అభిషేక్ బచ్చన్. ఎందుకంటే ఐశ్వర్య రాయ్ కి ఈ మధ్య కత్రినాకైఫ్ యవ్వారం నచ్చడంలేదట...ఎందుకంటే తన భర్తను హీరోగా ప్రకటించి అబ్బాస్ ముస్తాన్ గతంలో 'ఇటాలియన్ జాబ్" చిత్రం తీస్తున్నట్లు ప్రకటించాడు. అందులో హీరోయిన్ గా కత్రినాకైఫ్ ను కూడా ప్రకటించిన తర్వాత ఎందుకనో కత్రినా ఆ ప్రాజెక్టును వదిలేసుకుంది. అంతపెద్ద హీరోతో నటిస్తున్నానని కూడా ఆలోచించకుండా అలా ఉన్నపళంగా ఆ ప్రాజెక్టు వదిలేసుకోవడానికి కారణం అభిషేక్ నటించిన రావణ్ చిత్రం ఫెయిలవడమేనని ఐశ్వర్య అపార్థం చేసుకున్నట్లుంది. అంతే కత్రినాతో కలిసి నటించే దోస్తానా-2 చిత్రం నుంచి అభిషేక్ ను విరమించుకోవా ల్సిందిగా కోరినట్లు సమాచారం.
భార్య మాటలు మన్నించిన అభి ప్రస్తుతానికి ఆ ప్రాజెక్టును వదిలేసుకునే యోచనలో ఉన్నట్లు బాలీ వుడ్ టాక్. అంతేకాదు అభిషేక్ తీసుకునే నిర్ణయం భవిష్యత్ లో కత్రినాతో కలిసి నటించబోయే చిత్రాలపై పడటం ఖాయం అంటున్నారు సినీ విశ్లేషకులు...ఎంత పెద్ద పొజిషన్ లో ఉన్నా పెళ్లాం చెబితే వినాలి కదా...ఇప్పుడు అభిషేక్ తన భార్యకు కూడా అలానే ప్రాముఖ్యం ఇవ్వడం చూస్తుంటే ఇకపై అతని సినిమా హీరోయిన్లను కూడా దగ్గరుండి ఐశ్వర్య రాయే ఎంపికచేసేలా ఉంది...!