Don't Miss!
- News అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ షురూ: బారులు తీరిన ఓటర్లు
- Sports PBKS vs MI: అతను అసాధారణ బ్యాటింగ్తో భయపెట్టాడు: హార్దిక్ పాండ్యా
- Lifestyle గుడ్నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Technology 40 గంటలకు పైగా బ్యాటరీ బ్యాకప్, ChatGPT వాయిస్ AI సపోర్టుతో నథింగ్ ఇయర్బడ్స్ విడుదల.. సేల్ వివరాలు!
- Automobiles గొప్ప మనసు చాటుకున్న రాఘవ లారెన్స్.. దివ్యాంగులకు టీవీఎస్ స్కూటర్ల పంపిణీ
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
కియారా అద్వానీపై కన్నేసిన చిరంజీవి టీమ్.. ఆచార్యలోకి అందాల భామ
కరోనా వైరస్ లాక్డౌన్ కారణంగా ఆచార్య షూటింగ్ ఆగిపోయినప్పటికీ.. ఆ సినిమాలో కీలక పాత్ర ఎంపిక ప్రక్రియపై కసరత్తు భారీగానే జరుగుతున్నది. చిరంజీవి, కొరటాల కాంబినేషన్లో వస్తున్న ఈ చిత్రంలో లీడ్ హీరోయిన్గా కాజల్ అగర్వాల్ నటిస్తున్నారు. ఇక ఈ చిత్రంలో గెస్ట్ పాత్రలో రాంచరణ్ కనిపించబోతున్నారనే విషయం తెలిసిందే.
ఆచార్య విషయానికి వస్తే రాంచరణ్ విద్యార్థి నాయకుడిగాను నక్సలైట్ గాను రెండు కోణాలు ఉన్న పాత్రను పోషించనున్నారు. అయితే ఈ సినిమాలో పాత్ర కోసం మహేష్ బాబు పేరు వినిపించినప్పటికీ.. ఆ వార్తను స్వయంగా చిరంజీవి తోసిపుచ్చారు. అయితే RRR చిత్రంలో రాంచరణ్ నటిస్తున్నందున ఆ పాత్రను పోషిస్తారా? లేదా అనే మీమాంస కొనసాగించింది. చివరకు రాజమౌళిని ఒప్పించి ఆచార్యలో రాంచరణ్ పాత్రకు లైన్ క్లియర్ చేశారు.
అలాంటి కీలక మైన పాత్రకు జోడిగా రాంచరణ సరసన నటించే హీరోయిన్ ఎంపికపై ఇప్పుడు దృష్టి పెట్టారు. రాంచరణ్ కోసం కియారా అద్వానీ, లేదా కీర్తీ సురేష్లతో సంప్రదింపులు జరుపుతున్నట్టు సమాచారం. అయితే ఇంకా అధికారికంగా ఎలాంటి నిర్ణయం జరగలేదని తెలిసింది. త్వరలోనే ఆ ఇద్దరిలో ఒకరిని ఎంపిక చేసి వివరాలను మీడియాకు అందించాలని నిర్ణయించారు. గతంలో వినయ విధేయ రామలో రాంచరణ్ సరసన కియారా అద్వానీ నటించిన సంగతి తెలిసిందే. ఇక ఈ చిత్రంలో ఓ స్పెషల్ సాంగ్లో అనసూయను నటింపజేయాలని ప్రయత్నాలు చేస్తున్నారు.
ప్రస్తుతం ఆచార్య సినిమా షూటింగ్ లాక్డౌన్ కారణంగా నిలిచిపోయింది. కరోనా పరిస్థితులు అదుపులోకి వస్తే సెట్స్పైకి వెళ్లాలనే ప్రయత్నం చేస్తున్నారు. త్వరలోనే ఈ సినిమాను పూర్తి చేసి ప్రేక్షకుల ముందుకు వెళ్లాలని ఆలోచిస్తున్నారు.