Don't Miss!
- Automobiles 25 దేశాల్లో రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ రెంటల్స్ అండ్ టూర్స్ సర్వీస్.. RE ఫ్యాన్స్కు పండగే
- Sports వరుస పరాజయాల వేళ.. ఆర్సీబీ, కోహ్లీ ఫ్యాన్స్కు గుడ్ న్యూస్
- News AP Elections: నా కాళ్లు పట్టుకున్నావా లేదా ? పెద్దిరెడ్డికి కిరణ్ ఘాటు కౌంటర్.. !
- Finance Cerelac News: పేదదేశాల సెరెలాక్ ఉత్పత్తులో పంచదార..!! FSSAIకి నోటీసులు జారీ..
- Technology గూగుల్ మ్యాప్స్ కొత్త ఫీచర్ గురించి తెలుసా.. రోడ్ ట్రిప్ సహా ప్రయాణాల్లో ఆందోళన ఉండదిక...!
- Lifestyle గుడ్నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
మరో స్టార్ హీరోపై ఫోకస్ పెట్టిన KGF దర్శకుడు.. ఆఫీస్లో స్పెషల్ మీటింగ్
టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోలతో పాన్ ఇండియా సినిమాలు చేస్తే తప్పకుండా బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులను క్రియేట్ చేయవచ్చని కొంతమందికి చాలా క్లియర్ గా అర్థమైనట్లు ఉంది. ముఖ్యంగా KGF దర్శకుడు తన భవిష్యత్తు సినిమాలను ఎక్కువగా మన తెలుగు హీరోలతోనే చేసే ఛాన్స్ ఉన్నట్లు టాక్ వస్తోంది. ఇప్పటికే ఇద్దరి హీరోలను లాక్ చేసుకున్న ప్రశాంత్ నీల్ మరో స్టార్ హీరోతో కూడా చర్చలు మొదలు పెట్టినట్లు సమాచారం.
అంతకుమించి అనేలా..KGF 2
దర్శకుడు ప్రశాంత్ నీల్ KGF. చాప్టర్ 1తో కన్నడ సినిమా స్థాయిని నేషనల్ వైడ్ కు తీసుకు వచ్చాడు. బాహుబలి ఇచ్చిన స్ఫూర్తితో ప్రశాంత్ చేసిన యాక్షన్ మ్యాజిక్ ఆడియెన్స్ బాగానే కనెక్ట్ అయ్యింది. ఇక KGF చాప్టర్ 2 అంతకుమించి అనేలా ఉంటుందని టాక్ అయితే వస్తోంది. కానీ ఆ సినిమా విడుదల కాకముందే ప్రశాంత్ భవిష్యత్తు కథలకు హీరోలను సెలెక్ట్ చేసుకుంటున్నారు.
కొనసాగుతున్న.. సలార్
ఇప్పటికే రెబల్ స్టార్ ప్రభాస్ తో సలార్ సినిమాను సెట్స్ పైకి తీసుకు వచ్చిన విషయం తెలిసిందే. ఒక షెడ్యూల్ షూటింగ్ ను ను కూడా పూర్తి చేశారు. ఎప్పటికప్పుడు అప్డేట్స్ కు ఇస్తున్నారు. సినిమాను వచ్చే ఎడాది ఏప్రిల్ 14న విడుదల చేయబోతున్న విషయం తెలిసిందే. ఆ సినిమాలో ప్రభాస్ కు జోడిగా శ్రుతిహాసన్ నటిస్తోంది.
జూనియర్ ఎన్టీఆర్ తో సెట్టయినట్లే
అయితే ఇంకా రెండు సినిమాలను రిలీజ్ చేయాల్సిన బాధ్యతను మోస్తున్న దర్శకుడు ప్రశాంత్ నీల్ ఎలాంటి టెన్షన్ లేకుండా భవిష్యత్తు కథలను కూడా హ్యాపీగా రెడీ చేసుకుంటున్నాడు. జూనియర్ ఎన్టీఆర్ తో ఒక స్టోరీ లైన్ అయితే అనుకున్నారు. మైత్రి మూవీ మేకర్స్ ఆ కాంబోని సెట్స్ పైకి తీసుకు రావాలని చూస్తోంది.
గీత ఆర్ట్స్ లో బన్నీతో చర్చలు
ఇక చాలా కాలం తరువాత ప్రశాంత్ నీల్ అల్లు అర్జున్ ను కలవడం హాట్ టాపిక్ గా మారింది. గీత ఆర్ట్స్ ఆఫీస్ లో ఈ ఇద్దరు కూడా గంటల తరబడి చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. పుష్ప అనంతరం బన్నీ మరిన్ని పాన్ ఇండియా సినిమాలను చేస్తాడనడంలో ఎలాంటి సందేహం లేదు. అందుకే ప్రశాంత్ నీల్, బన్నీకి స్టోరీ లైన్ వినిపించినట్లు సమాచారం. మరి ఈ రూమర్ ఎంతవరకు నిజమో తెలియాలి అంటే మరికొన్నాళ్లు ఆగాల్సిందే!