Don't Miss!
- News బీఆర్ఎస్కు మరో షాక్: బీజేపీలోకి బేతి సుభాష్ రెడ్డి, ఈటలకు మద్దతు
- Sports IPL:ధోనీ ఫిక్సింగ్ చేశాడా..? సీఎస్కేను రెండేళ్లు ఎందుకు బ్యాన్ చేశారు..?
- Automobiles 5 రూపాయల గొడవ.. చిర్రెత్తి సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ప్రయాణికుడు.. అసలేం జరిగిందంటే.!!
- Technology Samsung నుంచి కొత్త 8K మరియు 4K AI టీవీ లు లాంచ్ అయ్యాయి! ధర, ఫీచర్లు, ఆఫర్లు
- Lifestyle Happy Birthday Wishes : పుట్టినరోజు శుభాకాంక్షలను ఇలా అందంగా తెలపండి..
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
కెజిఎఫ్ డైరెక్టర్తో చర్చలు.. మహేష్ బాబు నుంచి ప్యాన్ ఇండియా మూవీ?
Recommended Video
మంచి కంటెంట్ ఉంటే సౌత్ స్టార్స్ నటించిన సినిమాలు కూడా ప్యాన్ ఇండియా స్థాయిలో సక్సెస్ అవుతాయని బాహుబలి, బాహుబలి 2తో నిరూపితం అయింది. దీంతో పాటు కన్నడ నటుడు యష్ నటించిన 'కెజిఎఫ్' కూడా హిందీతో పాటు అన్ని భాషల్లో మంచి సక్సెస్ అందుకుంది. మరో వైపు ప్రభాస్ 'సాహో'తో, రామ్ చరణ్, ఎన్టీఆర్ 'ఆర్ఆర్ఆర్'తో ప్యాన్ ఇండియా స్థాయి సినిమాలు చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో మహేష్ బాబు కూడా కేవలం తెలుగు రాష్ట్రాలకు లేదా సౌత్ ఇండియాకే పరిమితమైన సినిమాలకే పరిమితం కాకుండా ప్యాన్ ఇండియా లెవల్ మూవీస్ చేయాలనే ఆలోచన చేస్తున్నారట. ఈ క్రమంతో ఆ స్థాయి చిత్రాలు తీయగల దర్శకులు మంచి కథతో ముందుకు వస్తే తాను చేయడానికి సిద్ధమనే సంకేతాలు పంపినట్లు తెలుస్తోంది.
ఆర్ఆర్ఆర్: విదేశీ బ్యూటీతో రొమాన్స్ చేయబోతున్న ఎన్టీఆర్?
నమ్రతను కలిసిన ప్రశాంత్ నీల్
ఫిల్మ్ నగర్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం ‘కెజిఎఫ్' దర్శకుడు ప్రశాంత్ నీల్ ఇటీవల మహేష్ బాబు భార్య నమ్రతను కలిసి తన వద్ద ఉన్నకథ చెప్పినట్లు సమాచారం. ‘కెజిఎఫ్ 2' తర్వాత తాను చేయాలనుకుంటున్న స్టోరీని నమ్రతకు వివరించారట.
నమ్రతకు నచ్చింది, కానీ...
ప్రశాంత్ నీల్ చెప్పిన స్టోరీ లైన్ నమ్రతకు నచ్చిందని, త్వరలోనే పూర్తి స్టోరీ ప్రిపేర్ చేసి మహేష్ బాబుకు వినిపించనున్నారని సమాచారం. ఆయన చెప్పే కథతో సూపర్ స్టార్ సంతృప్తి చెందితే త్వరలోనే ఈ ప్రాజెక్ట్ కార్యరూపం దాల్చే అవకాశం ఉంది.
మహేష్ బాబు సొంత బేనర్లోనే...
ప్రశాంత్ నీల్ చెప్పే కథ నచ్చితే ‘మహేష్ బాబు 27'గా ఈ చిత్రం తెరకెక్కే అవకాశం ఉంది. దీన్ని తమ సొంత ప్రొడక్షన్స్ ‘జి మహేష్ బాబు ఎంటర్టెన్మెంట్స్' పతాకంపై నిర్మించే అవకాశం ఉంది. ఈ ప్రాజెక్టుపై మరింత క్లారిటీ రావాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.
మహేష్ బాబు
ప్రస్తుతం మహేష్ బాబు తన 25వ చిత్రం ‘మహర్షి'.. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో చేస్తున్న సంగతి తెలిసిందే. దీని తర్వాత ఆయన తన 26వ చిత్రం ‘ఎఫ్ 2' ఫేం అనిల్ రావిపూడితో చేసేందుకు ప్లాన్ చేసుకుంటున్నారు.