Don't Miss!
- Finance Sensex News: 1000 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్.. దలాల్స్ట్రీట్ దున్నేస్తున్న బుల్స్..
- News ఏపీలో విపక్షాల ఫిర్యాదుల వేళ ఈసీ కీలక నిర్ణయం..! రంగంలోకి ఆ ముగ్గురు..
- Sports క్లాసెన్కు కావ్య మారన్ స్పెషల్ గిఫ్ట్!
- Automobiles హ్యుందాయ్ కస్టమర్లకు అదిరిపోయే న్యూస్.. వేసవిలో ప్రత్యేకంగా సర్వీస్ క్యాంప్.. ఎప్పటివరకు అంటే.??
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
- Lifestyle నోరూరించే పచ్చి మామిడికాయ గొజ్జు మామిడికాయ కర్రీ వేడివేడి అన్నంతో తింటుంటే ఆహా అనాల్సిందే..
- Technology ఆపిల్ వరల్డ్ వైడ్ డెవలపర్ కాన్ఫరెన్స్ 2024 తేదీ వెల్లడి.. iOS 18, GenAI పై కీలక ప్రకటనలకు అవకాశం..!
'ఖలేజా' సినిమా మరో అల్లూరి సీతారామరాజు దానికి నేను గ్యారంటీ ..!
ప్రిన్స్ మహేష్ బాబు పోకిరి సినిమా తర్వాత తనకంటూ ఓ ప్రత్యేకమైన స్టయిల్ ని ఏర్పరచుకున్నారు. మూడు సంవత్సరాల తర్వాత మహేష్ ఖలేజా అంటూ మన ముందుకు వస్తున్నారు. ఎప్పుడూ తన సినిమాల గురించి పెద్దగా మాట్లాడని మహేష్ బాబు మొట్టమొదటి సారి తన సినీ జీనితంలో 'ఖలేజా' సినిమా కలికితురాయిలా నిలిచిపోతుందని అన తన ట్వట్టర్ లో అభిమానులను ట్వీట్ చేశారు. అంతేకాకుండా ఎన్నడూ లేని విధంగా సరికొత్తగా ఆడియో విడుదల కాకముందే తన అభిమానులకోసం స్పెషల్ గా ఈ సినిమాకి సంబంధించిన భావాలను అభిమానులతో పంచుకున్నారు. ఈ సినిమాలో నా క్యారక్టరైజేషన్, నా కాస్ట్యూమ్స్ అన్నీ చాలా కొత్తగా ఉంటాయి. ఇంత మంచి చిత్రాన్ని నాకిస్తున్న నా మిత్రుడు త్రివిక్రమ్ కు నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను' అంటూ మహేష్ బాబు చెబుతుండడంతో అభిమానులు పండగ చేసుకుంటున్నారు.
గతంలో సూపర్ స్టార్ కృష్ణ నటించిన సూపర్ హిట్ చిత్రం అల్లూరి సీతారామరాజు గురించి మనం ప్రత్యేకంగా చెప్పకోనక్కర్లేదు. అప్పట్లో ఈ సినిమా సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. ఇప్పటికీ ఈ చిత్రంలో కృష్ణ పలికిన పవర్ ఫుల్ డైలాగ్స్ అందరి నోట నానుతూనే వుంటాయి. కృష్ణ తనయుడు మహేష్ బాబు త్వరలో అల్లూరి సీతారామరాజు గా ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ప్రిన్స్ మహేష్ బాబు నటించిన తాజా చిత్రం 'ఖలేజా' ఈ నెల 7న విడుదల కావటానికి సర్వం సిద్దమైంది. మూడేళ్ళ తర్వాత మహేష్ నుంచి వస్తున్న సినిమా కావడంతో దీనిపై భారీ అంచనాలున్నాయి. కాగా ఈ చిత్రంలో మహేష్ పాత్ర పేరు అల్లూరి సీతారామరాజు అన్నవిషయం అందరికి తెలిసిన విషయమే. ఈ సినిమా విడుదల కోసం ప్రపంచంలో ఉన్న ప్రిన్స్ మహేష్ అభిమానులు ఎదురుచూస్తున్నవిషయం తెలిసిందే.