Don't Miss!
- Automobiles కేవలం రూ. 8,999లకే డ్యాష్క్యామ్.. ఈ BIS కెమెరా కార్లకు పెట్టుకుంటే చాలు!!
- News అక్కడ.. యుద్ధ వాతావరణం: భారీగా దాడులు
- Sports PBKS vs MI: అతను అసాధారణ బ్యాటింగ్తో భయపెట్టాడు: హార్దిక్ పాండ్యా
- Lifestyle గుడ్నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Technology 40 గంటలకు పైగా బ్యాటరీ బ్యాకప్, ChatGPT వాయిస్ AI సపోర్టుతో నథింగ్ ఇయర్బడ్స్ విడుదల.. సేల్ వివరాలు!
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
అఖండ టీమ్ కీలక నిర్ణయం.. బాలయ్య రెడీ అయినా, వర్కౌట్ కాలేదే!
నటసింహ నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో అఖండ అనే సినిమా చేస్తున్నాడు. నిజానికి లెక్క ప్రకారం ఈ సినిమా మే నెలలో రిలీజ్ కావాల్సి ఉంది. కానీ కరోనా కేసులు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో ఈ మధ్య కాలంలో ఈ సినిమా షూటింగ్ నిలిపివేశారు.. అయితే కరోనా కేసులు పెరుగుతున్నా సరే జాగ్రత్తలు తీసుకుని ఈ సినిమా షూటింగ్ చేయాలని భావించారు. ఈ మేరకు మే 12 నుంచి హైదరాబాద్లో ఈ సినిమా షూటింగ్ జరిగే అవకాశాలు ఉన్నాయని కూడా ప్రచారం జరిగింది..
అయితే ఈ కరోనా కేసులు నమోదు ఏ మాత్రం తగ్గని నేపథ్యంలో ఈ సినిమా యూనిట్ కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. అసలు నిజానికి ఈనెల 28వ తారీఖున సినిమా రిలీజ్ కావాల్సి ఉంది అయితే బాలకృష్ణ-బోయపాటి ఎంత రిస్క్ అయినా చేసి సరే తగిన జాగ్రత్తలు తీసుకుంటూ ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసి 28వ తారీఖున రిలీజ్ చేయాలని ప్లాన్ చేశారు. కానీ ఈ నెలలో థియేటర్లు మళ్ళీ ఓపెన్ కావడం అసాధ్యమని అర్థమయ్యాక సినిమాని జూలై కి వాయిదా వేసి ఈ నెలలో షూటింగ్ పూర్తి చేయాలని భావించారు.
కానీ కరోనా కేసులు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో బాలకృష్ణ-బోయపాటి ఇప్పుడు కీలక నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది. ఇప్పుడు షూటింగ్ చేయడం అంత సేఫ్ కాదని భావించి ప్రస్తుతానికి షూటింగ్ క్యాన్సిల్ చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఒకసారి అన్ని పరిస్థితులు సెట్ అయ్యాక షూటింగ్ చేసే అవకాశం ఉందని అంటున్నారు. ఇక ఈ సినిమా నుంచి ఉగాది కానుకగా రిలీజ్ అయిన టీజర్ కి మంచి స్పందన లభించింది. ఒక సీనియర్ హీరో టీజర్ ఇంతలా రెస్పాన్స్ తీసుకోవడం ఇదే మొదటిసారి.