Don't Miss!
- Automobiles కారులో ఎక్కువ సౌండ్తో మ్యూజిక్ వింటూ వెళ్తున్నారా.. మీ కారు ప్రమాదానికి గురయ్యే అవకాశం ఎక్కువ.. ఎందుకంటే??
- News మండుటెండల్లో నారాయణ విద్యాసంస్థల సిబ్బందికి ఎన్నికల కష్టం!!
- Lifestyle రాత్రిపూట అలర్జీలు పెరుగుతున్నాయా? ఈ నియమాలు పాటిస్తే నిద్ర తేలికగా వస్తుంది
- Sports T20 వరల్డ్ కప్కు భారత తుదిజట్టు ఇదే - సెహ్వాగ్
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
- Technology Realme నుంచి రెండు కొత్త ఫోన్లు లాంచ్ అయ్యాయి! ధర రూ.11,999 కే మొదలు
Kiara Advani ప్రియుడితో పెళ్లి సిద్దమైన కియారా అద్వానీ.. పెళ్లి ఎప్పుడు? ఎక్కడంటే?
బాలీవుడ్లో స్టార్ హీరో, హీరోయిన్లు కియారా అద్వానీ, సిద్దార్థ్ మల్హోత్రా పెళ్లి వార్తలు కొద్దికాలంగా మీడియాలో గుప్పుమంటున్నాయి. అయితే వారిద్దరి మధ్య బ్రేకప్ జరిగిందనే వార్తలు కూడా ఇటీవల ప్రచారం అయ్యాయి. అయితే ఇటీవల ముంబైలో జరిగిన కొన్నిప్రీమియర్లకు వారిద్దరి కలిసి రావడంతో బ్రేకప్ రూమర్లకు బ్రేక్ పడింది. అయితే ప్రస్తుతం సిద్దార్థ్, కియారా పెళ్లి వార్త ముంబై మీడియాలో హల్చల్ చేస్తున్నది. ఈ పెళ్లి వార్త నిజమా? లేదా గాసిపేనా అనే విషయంలోకి వెళితే..
కియారా అఫైర్, బ్రేకప్
కొద్ది సంవత్సరాలుగా సిద్దార్థ్, కియారా అద్వానీ కలిసి మెలిసి సన్నిహితంగా ఉండటం, అలాగే ఒకరి ఇంట్లో మరొకరు కలిసి జీవించడంతో వారిద్దరి మధ్య అఫైర్ వార్త మీడియాలో విపరీతంగా నానింది. అయితే ఇటీవల కాలంలో వారిద్దరు ఎడమొఖం, పెడముఖంగా ఉంటున్నారు. వారిద్దరూ తమ రిలేషన్షిప్కు గుడ్బై చెప్పారనే వార్తలు వైరల్ అయ్యాయి.
కార్తీక్ ఆర్యన్ మూవీకి హాజరు
ఇలాంటి వార్తల మీడియాలో జోరుగా షికారు చేస్తుండగా.. కార్తీక్ ఆర్యన్ నటించిన భూల్ భులయ్యా 2 చిత్ర ప్రీమియర్కు కియారా, సిద్దార్థ్ ఒకరి చేతిలో మరొకరు చేయి వేసుకోని రావడంతో వారిద్దరి అఫైర్ కొనసాగుతందనే విషయం స్పష్టమైంది. మీడియాలో వచ్చే వార్తలన్నీ అవాస్తవాలనే అనే క్లారిటీ వచ్చేసింది.
కాఫీ విత్ కరణ్ సీజన్ 7 షోలో సిద్దార్థ్
బాలీవుడ్లో కొన్నేళ్లుగా డేటింగ్ చేస్తున్న సిద్దార్థ్, కియారా ఎప్పుడు తమ ప్రేమ వ్యవహారంపై మాట్లాడటానికి నిరాకరించారు. అయితే ఇటీవల కాఫీ విత్ కరణ్ సీజన్ 7 షోలో సిద్దార్థ్ తన ప్రేమ వ్యవహారాన్ని అధికారికంగా ప్రకటించారు. కియారాతో రిలేషన్షిప్ నిజమే అని చెప్పారు. దాంతో వారిద్దరి రిలేషన్షిప్కు అధికారికంగా ముద్ర పడింది.
ఢిల్లీలోని రిజిస్టర్ ఆఫీస్లో పెళ్లి
సిద్దార్థ్, కియారా తమ రిలేషన్షిప్ బంధాన్ని మరో మెట్టు ఎక్కించి ముందుకు తీసుకెళ్లడానికి రెడీ అయ్యారు. తమ పెళ్లికి ఏర్పాట్లు చేసుకొంటు ముందుకు వెళ్తున్నారు. ఇటీవల ఢిల్లీలోని రిజిస్టర్ ఆఫీస్లో పెళ్లి కోసం రిజిస్ట్రేషన్ చేసుకొన్నారు అని వారి సన్నిహితులు ధృవీకరించారు. దాంతో వారి పెళ్లి వార్తలకు బలమైన ఆధారం లభించినట్టయింది.
2023 ఏప్రిల్లో దేశరాజధానిలో
కియారా అద్వానీ, సిద్దార్థ్ మల్హోత్రా పెళ్లిని దేశ రాజధాని ఢిల్లీలో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. వచ్చే ఏడాది ఏప్రిల్లో వీరిద్దరి వివాహం జరుగుతుంది. కేవలం ఇరు కుటుంబాలకు చెందిన కొద్ది మంది సమక్షంలో వివాహం జరిపించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఆ తర్వాత ముంబైలో సినీ, ఇతర ప్రముఖులకు విందు ఏర్పాటు చేయాలనే యోచనలో ఉన్నట్టు సమాచారం.