Don't Miss!
- News వాళ్ళను తిడుతూనే.. వైఎస్ జగన్, భారతి వద్ద కోట్లలో వైఎస్ షర్మిలమ్మ అప్పులచిట్టా ఇదే!!
- Sports SRH vs RCB ఉప్పల్ మ్యాచ్కు భారీ అడ్డంకి..!
- Lifestyle నిమ్మరసంతో ఇన్ని ప్రయోజనాలాా..? కిడ్నీలో రాళ్లు కూడా మాయం, ఇంకా ఎన్నో..!
- Finance HDFC Bank: అంచనాకు అనుగుణంగానే హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఫలితాలు..!
- Automobiles త్వరలోనే ఎయిర్ ట్యాక్సీ సర్వీస్.. 7 నిమిషాల్లో 30 కి.మీ జర్నీ.. ఇండిగో గుడ్ న్యూస్
- Technology ధర రూ.1099 కే నావిగేషన్ ఫీచర్ తో boAt స్మార్ట్ వాచ్! సేల్, ఫీచర్ల వివరాలు
- Travel తెలంగాణ టూరిజం.. హైదరాబాద్ టు షిర్డీ ఫ్లైట్ టూర్ ప్యాకేజీ..
టాప్ డైరెక్టర్ కూతురుతో మహేష్ బాబు రొమాన్స్.. కియారా అద్వానీ అవుట్
సరిలేరు నీకెవ్వరు లాంటి బ్లాక్బస్టర్ సినిమా తర్వాత సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న చిత్రం సర్కారు వారీ పాట. గీత గోవిందం లాంటి సూపర్ హిట్ అందించిన దర్శకుడు పరుశురాంతో జతకట్టి విభిన్నమైన కథతో ముందుకొస్తున్నారు. ఈ చిత్రానికి ఎస్ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నారు. అయితే ఈ సినిమాలో నటించే హీరోయిన్ ఎంపిక గురించి రక రకాల కథనాలు మీడియాలో వినిపిస్తున్నాయి. వివరాల్లోకి వెళితే..
Recommended Video
మహేష్ సరసన కొత్త హీరోయిన్
వారం రోజు క్రితం మహేష్ సరసన సర్కారు వారి పాట చిత్రంలో కియారా అద్వానీ నటిస్తున్నారు. భరత్ అనే నేను సినిమా తర్వాత మహేష్తో నటించే రెండో సినిమా అనే వార్త వినిపించింది. అయితే ఇప్పుడు మహేష్తో మరో హీరోయిన్ సాయి మంజ్రేకర్ నటిస్తున్నారనే వార్త ఆసక్తిగా మారింది.
డేట్స్ సమస్యతో కియారా అవుట్
అయితే లాక్ డౌన్ కారణంగా కియారాకు డేట్స్ అడ్జస్ట్ చేయడంలో ఇబ్బందులు ఏర్పడ్డాయి. దాంతో డేట్స్ సమస్య వల్ల కియారా అద్వానీ ఈ సినిమా నుంచి తప్పుకొన్నది. అందుకే మహేష్తో నటించలేకపోతున్నారు అంటూ తాజా కథనం వివరించింది. ఆమె స్థానంలో సాయి మంజ్రేకర్ హీరోయిన్గా ఖరారు అయిందనే వార్త వినిపిస్తున్నది.
సల్మాన్ హీరోయిన్తో మహేష్ బాబు
సాయి మంజ్రేకర్ 29న జన్మించిన ఆమె ప్రముఖ నటుడు, దర్శకుడు మహేష్ మంజ్రేకర్ కూతురు. ధిరూభాయ్ అంబానీ ఇంటర్నేషనల్ స్కూల్లో, యూనివర్సిటీ ఆఫ్ ముంబైలో చదువుకొన్నారు. తాజాగా దంబంగ్ 3 చిత్రంలో సల్మాన్ ఖాన్ సరసన నటించారు. ఉత్తమ తొలి చిత్ర నటిగా ఫిల్మ్ ఫేర్ అవార్డును గెలుచుకొన్నారు.
త్వరలోనే సెట్స్పైకి సర్కారు వారీ పాట
వాస్తవానికి సర్కారు వారి పాట చిత్రం ఎప్పుడో ప్రారంభం కావాల్సింది. అయితే లాక్డౌన్ కారణంగా ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కాలేదు. ప్రస్తుతం లాక్డౌన్ విషయంలో సడలింపులను ప్రభుత్వం ఇవ్వడంతో సినిమాను సెట్స్పైకి తీసుకెళ్లేందుకు ప్రయత్నం చేస్తున్నారు. త్వరలోనే ఈ చిత్ర షూటింగ్ ప్రారంభం కానున్నది.