Don't Miss!
- News ముగిసిన నామినేషన్ల పర్వం: బండి సంజయ్ సహా చివరి రోజు నామినేషన్లు వేసింది వీరే
- Sports SRH vs RCB: హమ్మయ్యా.. ప్రశాంతంగా పడుకుంటాం! ఆ గ్రౌండ్తోనే మాకు ఇబ్బంది: ఫాఫ్ డుప్లెసిస్
- Lifestyle ఈ 4 రాశుల వారు ఎల్లప్పుడూ ఇతరులకు రహస్య శ్రేయోభిలాషులు..
- Technology OnePlus Watch 2 వన్ప్లస్ వాచ్ 2 కొత్త వేరియంట్ విడుదల.. ధర, సేల్ పూర్తి వివరాలు..!
- Finance Jio Cinema Premium: నెలకు 29లతో జియో ప్రీమియం..
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
డైరెక్టర్కు స్వీట్ వార్నింగ్.. నాని ఆశలపై నీళ్లు చల్లిన కోన వెంకట్
రైటర్గా కెరీర్ను ఆరంభించి సినీ రంగంలో ఎన్నో విభాగాల్లో పని చేశారు కోన వెంకట్. ఆ తర్వాత మంచి నిర్మాతగానూ పేరు తెచ్చుకున్నారు. ఎన్నో సూపర్ హిట్ చిత్రాలకు కథలు అందించి సక్సెస్ఫుల్ రైటర్గా పేరు సంపాదించుకున్న ఆయన.. నిర్మాతగానూ కొన్ని మంచి సినిమాలను తెరకెక్కించారు. ఈ నేపథ్యంలోనే మరికొన్ని చిత్రాలను నిర్మించేందుకు ప్రయత్నాుల కూడా చేస్తున్నారు.
ఇందులో భాగంగానే ఇటీవల చిన్న సినిమాగా వచ్చి, పెద్ద విజయం సాధించిన 'ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ' డైరెక్టర్ స్వరూప్తో సినిమా చేయడానికి సిద్ధమయ్యారు. కోన ఫిలింకార్పొరేషన్ బ్యానర్లో సినిమా చేయడానికి కమిట్మెంట్ కూడా తీసుకున్నారు. ఈ మేరకు అతడికి అడ్వాన్స్ కూడా చెల్లించారని తెలిసింది. కానీ, తాజాగా స్వరూప్తో సినిమా చేయడానికి నేచురల్ స్టార్ నాని సన్నాహాలు చేస్తున్నాడని వార్తలు వచ్చాయి.
స్వరూప్ రెండో సినిమాను నాని నిర్మించబోతున్నారని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో.. కోన వెంకట్ సదరు డైరెక్టర్కు స్వీట్ వార్నింగ్ ఇచ్చారని గుసగుసలు వినిపిస్తున్నాయి. 'ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ' విడుదలకు ముందే బుక్ చేసుకున్నందున తనతోనే సినిమా చేయాలని స్వరూప్తో కోన అన్నారని తెలుస్తోంది. మరోవైపు, నేచురల్ స్టార్ నానీతో సినిమా చేయాలనుందని స్వరూప్ ఇటీవల జరిగిన ఇంటర్వ్యూల్లో తెలిపారు. దీంతో ఈ వార్తలకు బలం చేకూరింది.
మరి, వీరిద్దరిలో స్వరూప్ ఎవరితో సినిమా చేస్తాడు అన్నది మాత్రం తెలియడం లేదు. వాస్తవానికి కోన వెంకట్కు నానికి మధ్య సన్నిహిత సంబంధాలే ఉన్నాయి. గతంలో 'నిన్నుకోరి' సినిమాకు వీరిద్దరూ కలిసి పని చేశారు. సో.. ఒకవేళ నాని సినిమా తీస్తానని కచ్చితంగా చెబితే.. కోన ఒప్పుకునే అవకాశాలు కూడా ఉన్నాయన్న టాక్ వినిపిస్తోంది.
నవీన్ పొలిశెట్టి, శ్రుతి శర్మ జంటగా నటించిన 'ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ'ను స్వరూప్ తెరకెక్కించాడు. సస్పెన్స్ థ్రిల్లర్గా తెరకెక్కిన ఈ సినిమా సూపర్ హిట్ టాక్ను సొంతం చేసుకుంది. అంతేకాదు, భారీ వసూళ్లను సైతం రాబట్టింది. చాలా మంది ఈ డైరెక్టర్ టాలెంట్ను కొనియాడారు. ఈ సినిమా తర్వాత ఎంతో మంది హీరోలు నిర్మాతలు స్వరూప్తో సినిమాలు చేయడానికి ముందుకు వచ్చారు.