Don't Miss!
- Sports PBKS vs MI: ఆ తప్పిదంతోనే గెలిచే మ్యాచ్లో ఓడాం: సామ్ కరణ్
- News పొన్నూరు వైసీపీ అభ్యర్థి అంబటి మురళీపై చర్యలకు ఈసీ ఆదేశం
- Lifestyle గుడ్నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Technology 40 గంటలకు పైగా బ్యాటరీ బ్యాకప్, ChatGPT వాయిస్ AI సపోర్టుతో నథింగ్ ఇయర్బడ్స్ విడుదల.. సేల్ వివరాలు!
- Automobiles గొప్ప మనసు చాటుకున్న రాఘవ లారెన్స్.. దివ్యాంగులకు టీవీఎస్ స్కూటర్ల పంపిణీ
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
ఎన్టీఆర్ కోసం కొరటాల నయా స్కెచ్.. ఆ మ్యూజిక్ డైరెక్టర్ రంగంలోకి.. చార్ట్ బస్టర్ పక్కా!
ఎన్టీఆర్ కొరటాల శివ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ సినిమాతో బిజీగా ఉన్న ఎన్టీఆర్ ఈ సినిమా షూటింగ్ పూర్తయిన వెంటనే కొరటాల శివతో సినిమా షూటింగ్ మొదలు పెట్టనున్నారు.. నిజానికి ముందుగా త్రివిక్రమ్ తో సినిమా చేయాలని అనుకున్నా అనుకోని కారణాలతో ఆ సినిమా క్యాన్సిల్ అయింది.. ఇక కొరటాల శివ సినిమా గురించి అనేక ప్రచారాలు ముందు నుంచి జరుగుతూ వస్తున్నాయి. తాజాగా ఈ సినిమా గురించి మరో ఆసక్తికర ప్రచారం జరుగుతోంది, ఆ వివరాల్లోకి వెళితే
హీరోయిన్ ఫిక్స్
కొరటాల శివ - ఎన్టీఆర్ సినిమాలో భరత్ అనే నేను సినిమాలో హీరోయిన్ గా నటించిన కియారా అద్వానీ నటించనుందని ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే. ఈ విషయం మీద ఎన్టీఆర్ పుట్టిన రోజున క్లారిటీ వస్తుందని భావించినా ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. తాజాగా జరుగుతున్న ప్రచారం మేరకు ఈ సినిమా కోసం కొరటాల పెద్ద ప్లానే వేస్తున్నట్లు తెలుస్తోంది.
ప్యాన్ ఇండియా ప్లాన్
ఆర్ఆర్ఆర్ సినిమా రిలీజ్ తర్వాత ఎన్టీఆర్ ప్యాన్ ఇండియా క్రేజ్ వస్తుందని భావిస్తున్న ఆయన ఈ సినిమాను కూడా ప్యాన్ ఇండియా లెవెల్ లో రిలీజ్ చేసే ఆలోచనలో చేస్తున్నారట. తాజాగా అందుతున్న సమాచారం మేరకు ఈ సినిమాలో మ్యూజిక్ డైరెక్టర్ గా తమిళ యువ సంగీత సంచలనం అనిరుద్ రవిచందర్ తో సంప్రదింపులు జరుపుతున్నారట.
తమిళ్ మ్యూజిక్ దర్శకుడే
తమిళ సంగీత దర్శకుడు అయినా ఇప్పటికే తెలుగులో ఆయన మూడు సినిమాలు చేశారు. తెలుగులో ఆయన చేసిన అజ్ఞాతవాసి, గ్యాంగ్ లీడర్, జెర్సీ సినిమాలు మ్యూజిక్ విషయంలో సూపర్ హిట్ గా నిలిచాయి. ఇక ఈ సినిమాను పాన్ ఇండియా లెవెల్ లో రిలీజ్ చేయాలని భావిస్తున్న కొరటాలశివ అందరు టెక్నీషియన్స్ తెలుగు నుంచి ఉంటే పాన్ ఇండియా లెవెల్ లో ఇంపాక్ట్ ఉండదని, అందుకే ఇతర భాషల నటులను అలాగే టెక్నీషియన్స్ ని కూడా తీసుకోవాలని ఫిక్స్ అయ్యారట. అందులో భాగంగానే అనిరుద్ రవిచంద్రన్ తో సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలుస్తోంది. మరి ఏమి జరుగుతుంది అనేది వేచి చూడాలి మరి.
జనాల్లో ఆసక్తి
ఎన్టీఆర్ ఆర్ట్స్, నందమూరి కళ్యాణ్ రామ్ ఆర్ట్స్, యువ సుధా ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి సుధాకర్ మిక్కిలినేని నిర్మాతగా వ్యవహరించనున్నారు. గతంలో ఎన్టీఆర్- కొరటాల కాంబోలో వచ్చిన 'జనతా గ్యారేజ్' మూవీ నందమూరి అభిమానులకు స్పెషల్ కిక్కిచ్చింది. దీంతో మరోసారి ఈ కాంబో మూవీ రానుండటం జనాల్లో ఆసక్తి పెంచింది. చూడాలి మరి అంచనాలు ఏమేరకు అందుకుంటుందో ?