twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మెగాస్టార్ కంటే మహేష్ బాబే ముందు.. హ్యాట్రిక్ బ్లాక్‌బస్టర్‌పై కన్ను, ఇలా చేశాడేంటి!

    |

    మెగాస్టార్ చిరంజీవి రీఎంట్రీ తరువాత అదరగొడుతున్నాడు. చిరంజీవి కోసం బడా దర్శకులు క్యూ కడుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం చిరంజీవి 200 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న సైరా నరసింహా రెడ్డి చిత్రంలో నటిస్తుంన్నారు. ఈ చిత్రం కోసం అటు అభిమానులు, ఇటు సినీవర్గాలు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నాయి. సురేందర్ రెడ్డి దర్శత్వంలో తెరకెక్కుతున్న సైరా చిత్రం వచ్చే ఏడాది వేసవిలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇదిలా ఉండగా సైరా చిత్రం తరువాత చిరంజీవి.. వరుస విజయాల దర్శకుడు కొరటాల శివతో సినిమా చేయాల్సి ఉంది. తాజాగా ఈ చిత్రంపై షాకింగ్ న్యూస్ వినిపిస్తోంది.

    మెగాస్టార్ కోసం కథ రెడీ

    మెగాస్టార్ కోసం కథ రెడీ

    భరత్ అనే నేను ఘనవిజయం తరువాత దర్శకుడు కొరటాల శివ తెరకెక్కించే చిత్రంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. మెగాస్టార్ చిరంజీవిని కొరటాల శివ డైరెక్ట్ చేయబోతున్నారు అనే వార్త రావడంతో మెగా అభిమానులు ఖుషి అయ్యారు. కొరటాల సినిమా అంటే గ్యారెంటీ హిట్ అని డిసైడ్ అయ్యారు. చిరంజీవి కోసం కొరటాల అద్భుతమైన సందేశంతో ఓ కథ సిద్ధం చేసారని వార్తలు వచ్చాయి. త్వరలోనే ఈ చిత్రం ప్రారంభం కాబోతోంది అని కూడా ప్రచారం జరిగింది.

    సైరా ఆలస్యం

    సైరా ఆలస్యం

    ఇదిలా ఉండగా కొరటాల శివ మెగాస్టార్ చిరంజీవి కంటే ముందుగా మరో హీరోని డైరెక్ట్ చేయబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. సైరా చిత్రం మరింత ఆలస్యం కానుండడంతో కొరటాల శివ మనసు మార్చుకున్నట్లు తెలుస్తోంది. కొరటాల, చిరు చిత్రానికి అంతా సిద్ధం అనుకున్న సమయంలో ఈ వార్తలు రావడంతో మెగా అభిమానులు ఆశ్చర్యపోతున్నారు. చిరు కోసం ఆల్రెడీ కథ సిద్ధంగా ఉంది. కానీ సైరా వచ్చే ఏడాది వేసవికి కానీ పూర్తి అయ్యేలా కనిపించడం లేదు. దీనితో తన వద్ద ఉన్న మరో కథతో మహేష్‌తో సినిమా చేయాలని కొరటాల భావిస్తున్నాడట.

    హ్యాట్రిక్‌పై కన్ను

    హ్యాట్రిక్‌పై కన్ను

    కొరటాల శివ, మహేష్ బాబు కాంబినేషన్ ఇప్పటికే సూపర్ హిట్ అయింది. వీరి కాంబినేషన్ లో వచ్చిన శ్రీమంతుడు చిత్రం నాన్ బాహుబలి రికార్డులు క్రియేట్ చేసింది. గ్రామాన్ని దత్తత తీసుకునే కాన్సెప్ట్ తో కొరటాల, మహేష్ అదరగొట్టేశారు. ఆ తరువాత మహేష్‌ని సీఎంగా చూపిస్తూ కొరటాల భరత్ అనే నేను చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ చిత్రం కూడా ఘనవిజయం సాధించింది. ప్రస్తుతం మహేష్ నటిస్తున్న మహర్షి చిత్రం వచ్చే ఏడాది పిబ్రవరికల్లా పూర్తి కానుండడంతో కొరటాల అతడిపై దృష్టి పెట్టాడు.

    సుకుమార్ సినిమా

    సుకుమార్ సినిమా

    వాస్తవానికి మహేష్ బాబు మహర్షి చిత్రం తరువాత సుకుమార్ దర్శత్వంలో నటించాల్సి ఉంది. కానీ ఈ చిత్రం ఆలస్యం కానుండడంతో కొరటాల లైన్ లోకి వచ్చారు. మొత్తంగా గందరగోళం సృష్టిస్తున్న ఈ కాంబినేషన్ వ్యవహారం తేలాలంటే అధికారిక ప్రకటన రావాల్సిందే.

    English summary
    Koratala Siva To direct Mahesh babu Ahead of Chiranjeevi. Here is the details
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X