Don't Miss!
- News నామినేషన్ల పర్వంలో టీడీపీకి ఊహించని షాక్
- Sports SRH vs RCB: కొంపముంచిన విరాట్ కోహ్లీ జిడ్డు బ్యాటింగ్!
- Technology OnePlus Watch 2 వన్ప్లస్ వాచ్ 2 కొత్త వేరియంట్ విడుదల.. ధర, సేల్ పూర్తి వివరాలు..!
- Lifestyle పాలలో తామరవిత్తనాలు కలుపుకొని తాగితే ఇన్ని ప్రయోజనాలుంటాయా..?
- Finance Jio Cinema Premium: నెలకు 29లతో జియో ప్రీమియం..
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
ఎన్టీఆర్ తర్వాత అఖిల్తో.. స్వయంగా నాగార్జున రంగంలోకి!
అక్కినేని వారసుడు అఖిల్ నటించిన మూడవ చిత్రం మిస్టర్ మజ్ను కూడా నిరాశపరిచింది. అఖిల్ ఈ చిత్రంపై ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు. వెంకీ అట్లూరి ఈ చిత్రంలో అఖిల్ ని లవర్ బాయ్ పాత్రలో చూపించాడు. అఖిల్ ఫ్యామిలీ ఎమోషన్స్ కూడా పండించాడు. కానీ సినిమా రాణించలేదు. తొలి రెండు చిత్రాలకంటే ఈ చిత్రంలో అఖిల్ కు నటన పరంగా ప్రశంసలు దక్కాయి. తాజా సమాచారం ప్రకారం అఖిల్ తదుపరి చిత్రం కోసం కొంత సమయం గ్యాప్ తీసుకోబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. అఖిల్ తదుపరి చిత్రం విషయంలో శ్రీనువైట్ల, పూరి జగన్నాథ్ పేర్లు వినిపిస్తుండగా మరో క్రేజీ దర్శకుడు కూడా సీన్ లోకి వచ్చాడు. ఆ వివరాలు చూద్దాం.
ప్లాప్ దర్శకుల పేర్లు
అఖిల్ తదుపరి చిత్రం విషయంలో చాలా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. శ్రీను వైట్ల, పూరి జగన్నాథ్ లాంటి దర్శకులు అఖిల్ తో సినిమా చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. కానీ నాగార్జున ఎవ్వరిని ఫైనల్ చేయలేదు. అఖిల్ కోసం స్పోర్ట్స్ నేపథ్యంలో ఓ కథ రెడీగా ఉన్నట్లు కూడా ప్రచారం జరుగుతోంది. కానీ నాగార్జున మాత్రం కొంత సమయం గ్యాప్ తీసుకోవాలని అఖిల్ కి సూచించాడట. కథ,దర్శకుడు ఇలా అన్ని అంశాలు కుదిరాకే సినిమా ప్రారంభించాలని నాగార్జున సూచించినట్లు తెలుస్తోంది.
క్రేజీ డైరెక్టర్ సీన్లోకి
ఇదిలా ఉండగా ప్రతిభగల దర్శకుడు క్రిష్ సీన్ లోకి వచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. అఖిల్ కోసం క్రిష్ చెప్పిన కథ నాగార్జునని ఇంప్రెస్ చేసినట్లు తెలుస్తోంది. అఖిల్ కు ఇదే సరైన కథ అని భావించిన నాగ్ ఈ చిత్రం విషయంలో పక్కా ప్రణాళికతో వ్యవహరించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. దీనితో నాగార్జునే అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ లో ఈ చిత్రానికి నిర్మించేందుకు సిద్ధం అవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. కానీ ముందుగా అనుకున్నట్లుగా అఖిల్ కొన్ని నెలల పాటు విశ్రాంతి తీసుకున్న తర్వాతే ఈ చిత్రం ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది.
'ఎన్టీఆర్'తో బిజీగా
దర్శకుడు క్రిష్ ప్రస్తుతం ఎన్టీఆర్ చిత్రంతో బిజీగా గడుపుతున్నాడు. ఎన్టీఆర్ కథానాయకుడు ఇప్పటికే విడుదలైంది. ఎన్టీఆర్ మహానాయకుడు విడుదలకు సిద్ధం అవుతున్న నేపథ్యంలో క్రిష్ ఫినిషింగ్ టచ్ ఇస్తున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రం విడుదలయ్యాక అఖిల్ సినిమాపై క్రిష్ దృష్టిపెట్టనున్నాడు. క్రిష్ స్నేహితులు కూడా ఈ చిత్ర నిర్మాణంలో భాగస్వాములు అవుతారని వార్తలు వస్తున్నాయి. కానీ అఖిల్ తదుపరి చిత్రంపై అధికారిక ప్రకటన మాత్రం రాలేదు.
సందేశాత్మక చిత్రాలు
అఖిల్ తొలి రెండు చిత్రాలకు అధిక బడ్జెట్, భారీ స్థాయిలో జరిగిన ప్రీరిలీజ్ బిజినెస్ కొంపముంచాయి. మిస్టర్ మజ్ను చిత్రాన్ని లిమిటెడ్ బడ్జెట్ లో ఫినిష్ చేసినా ఫలితం లేకుండా పోయింది. క్రిష్ కు సందేశాత్మక చిత్రాలు అందించే దర్శకుడిగా పేరుంది. అఖిల్ కు అవసరమైన కమర్షియల్ హిట్ ఏ మేరకు అందించగలడో వేచి చూడాలి.