twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    బాహుబలి దారిలో ఎన్టీఆర్ బయోపిక్.. క్రిష్ సంచలన నిర్ణయం!

    |

    తెలుగు జాతి ఖ్యాతిని నలుదిశలా చాటిన మహానీయుడు, మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు జీవిత కథ ఆధారంగా ఎన్టీఆర్ బయోపిక్ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. సంక్రాంతి బరిలో దూకేందుకు ఈ చిత్రం శరవేగంగా షూటింగ్ జరుపుకొంటున్నది. ఈ ప్రాజెక్ట్‌ నుంచి దర్శకుడు తేజను పక్కకు తప్పించిన తర్వాత క్రిష్ జాగర్లముడి డైరెక్షన్‌లో షూటింగ్ పక్కాగా జరుగుతున్నది. అయితే ఈ చిత్ర సినిమా గురించి ఆసక్తికరమైన విషయం మీడియాలో వైరల్‌గా మారింది. అదేమిటంటే..

    <strong>ఆడ పిల్లకు అన్యాయం జరిగితే... అమితాబ్ బచ్చన్ ఇలాగేనా మాట్లాడేది?</strong>ఆడ పిల్లకు అన్యాయం జరిగితే... అమితాబ్ బచ్చన్ ఇలాగేనా మాట్లాడేది?

    టెన్షన్‌లో పడిన క్రిష్

    టెన్షన్‌లో పడిన క్రిష్

    మహానటుడు ఎన్టీఆర్ జీవితాన్ని రెండున్నర గంటల్లో చూపిస్తే ప్రేక్షకులు సంతృప్తి చెందుతారా? అనే ప్రశ్న మొదటి నుంచి వెంటాడుతున్నది. అలా చూపించిన ఏదో మొక్కుబడిగా కానిచ్చేశారనే వాదన బలపడటం ఖాయం. ఇలాంటి పరిస్థితుల్లో దర్శకుడు క్రిష్ టెన్షన్‌లో పడిపోయాడట. చివరకు బాలకృష్ణ, ఇతరులతో చర్చించిన తర్వాత ఓ నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తున్నది.

    రెండు భాగాలుగా బయోపిక్

    రెండు భాగాలుగా బయోపిక్

    ఎన్టీఆర్ బయోపిక్‌ను రెండు భాగాలుగా విడుదల చేయాలని క్రిష్‌తోపాటు చిత్ర యూనిట్ భావిస్తున్నదట. అందులో భాగంగా ఇప్పటి వరకు ఉన్న ప్రణాళికలో కొద్దిగా మార్పు చేసినట్టు తెలుస్తున్నది. ఎన్టీఆర్ సినీ, వ్యక్తిగత జీవితాన్ని మొదటి భాగంలో.. రాజకీయ జీవితంలో ఒడిదుడుకులు రెండో భాగంలో చూపించే ప్రయత్నం జరుగుతున్నదట.

    రాజమౌళి దారిలో క్రిష్

    రాజమౌళి దారిలో క్రిష్

    ఎన్టీఆర్ బయోపిక్‌ రిలీజ్ విషయంలో బాహుబలి విషయంలో దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి అనుసరించిన పంథానే క్రిష్ కూడా చేపట్టబోతున్నట్టు సమాచారం. సంక్రాంతికి పార్ట్-1ను రిలీజ్ చేసి.. మరో రెండు నెలల్లోపు పార్ట్-2 రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నట్టు సమాచారం. ఇదే స్ట్రాటెజీ నిజమైతే నందమూరి, సినీ అభిమానులకు పండుగే అంటున్నారు.

    భారీగా నటీ, నటులు

    భారీగా నటీ, నటులు

    ఎన్టీఆర్ బయోపిక్‌లో భారీ సంఖ్యలో స్టార్ నటీనటులు నటిస్తున్నారు. తన తండ్రి ఎన్టీఆర్ పాత్రలో బాలకృష్ణ, బసవతారకం పాత్రలో విద్యాబాలన్ కనిపిస్తారు. అక్కినేని నాగేశ్వరరావుగా సుమంత్, చంద్రబాబుగా రానా, శ్రీదేవిగా రకుల్ ప్రీత్ సింగ్, జయప్రదగా రాశీఖన్నా తదితరులు నటిస్తున్నారు.

    English summary
    N.T.R is being produced by Nandamuri Balakrishna, Vishnu Induri and Sai Korrapati jointly. The biopic will hit the screens in January 2019. Nithya Menen has been signed on to play Savitri in N.T.R and an official announcement would be made soon by the makers. If these reports are to be believed, the makers were quite keen on signing on Nithya for a long time now and she was the first choice for the role.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X