ఉషాకిరణ్ బ్యానర్ లో డైరక్టర్ క్రిష్ చిత్రం..డిటేల్స్

'నాన్న' చిత్రంలో ఆత్మీయ నటనను ప్రదర్శించి అందర్నీ ఆకట్టుకున్న సారా గుర్తుందిగా?.. ఆమె ప్రధాన పాత్రలో 'తలైవా' ఫేం ఏఎల్ విజయ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'శైవం'. తమిళంలో ఆ మధ్యన విడుదలైన ఈ సినిమా అన్ని వర్గాల నుంచి కితాబు అందుకుంది. ఇందులో సారా నటన అద్భుతంగా ఉందని ప్రేక్షకులు ఆనందం వ్యక్తం చేసారు. విజయ్ కూడా మంచి విజయం దక్కిన సంతోషంతో ఉబ్బితబ్బిబ్బవుతున్నారు. తెలుగు వెర్షన్ లో కూడా ఆమెనే తీసుకునే అవకాసం ఉంది. తాత, మనవరాలి మధ్య ఉన్న బంధం నేపథ్యంలో 'శైవం' తెరకెక్కించారు. ఈ చిత్రం ఫస్ట్ లుక్ ని కేవలం ఓ కోడిపుంజు వేసి వదిలి, అందరినీ ఆశ్చర్యంలో పడేసారు.
ఇందులో 'దైవతిరుమగల్' ఫేం బేబీ సారా నటించటం ప్లస్ అయ్యింది. నాజర్ ముఖ్యపాత్ర పోషించారు. నాజర్ కుమారుడు బాషా కూడా ఈ సినిమా ద్వారా పరిచయమయ్యారు. 'శైవం' చిత్రాన్ని చూసిన రెడ్ జెయింట్ మూవీస్ బ్యానరు నిర్మాత, నటుడు ఉదయనిధి.. ఈ సినిమాను విడుదల చేసేందుకు ముందుకొచ్చారు.
క్రిష్ విషయానికి వస్తే...
గతంలో క్రిష్...కంటెంట్ నే నమ్ముకుని గమ్యం, వేదం, కృష్ణం వందే జగద్గురం చిత్రాలు చేసారు. ప్రస్తుతం తమిళ రీమేక్ గబ్బర్ లో బిజీగా ఉన్నారు. గబ్బర్ చిత్రం తమిళ చిత్రం రమణ కు రీమేక్. రమణ చిత్రం తెలుగులో ఠాగూర్ గా వచ్చి హిట్టైంది. అక్షయకుమార్ హీరోగా చేస్తున్న ఈ చిత్రాన్ని సంజయ్ లీలా భన్సాలీ ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఈ చిత్రంపై బాలీవుడ్ లో మంచి అంచనాలే ఉన్నాయి.


Click it and Unblock the Notifications











