twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    'గమ్యం'క్రిష్ కొత్త ప్రాజెక్టు?(స్పెషల్)

    By Staff
    |

    Krish
    గమ్యం సినిమాతో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న క్రిష్ తాజాగా వేదం అనే చిత్రానికి శ్రీకారం చుడుతున్నట్లు సమాచారం. ప్రముఖ దర్శకుడు కె.రాఘవేంద్రరావు నిర్మాణ సంస్ధలలో ఒకటయిన ఆర్కా ఈ చిత్ర నిర్మాణాన్ని భుజానికెత్తుకుందని తెలుస్తోంది. నలుగురు కుర్రాళ్ళు..వారిఆశలు, ఆందోళలనలు, ఆవేశాలు, ఆశయాలు ఏ విధంగా ఉంటున్నాయనే కోణంలో చిత్రం నడుస్తుందని విశ్వసనీయంగా తెలుస్తోంది. అలాగే ఈ చిత్రంలో అంతా కొత్త వాళ్ళనే తీసుకునే ఆలోచనలో దర్శక, నిర్మాతలు ఉన్నట్లు చెప్తున్నారు. నిజానికి ఇది వెంకటేష్ ని బేస్ చేసుకుని అల్లిన కృష్ణం వందే జగత్గురం కథనే అంటన్నారు.

    బాలీవుడ్ సూపర్ హిట్ రంగ్ దే బసంతి స్టోరీ లైన్ బేస్ చేసుకుని కథనం నడుస్తుందని చెప్తున్నారు. అందుకోసమే అప్పట్లో ఓ ఫారినర్ ని కీలకమైన పాత్రకు తీసుకునేందుకు ప్లాన్ చేసారని, వెంకటేష్ ఎన్నారైగా కనిపించబోతున్నారనే వార్తలు వినపడ్డాయి. అలాగే ఈ చిత్రంలో సీతారామశాస్త్రిగారబ్బాయి రాజా ఓ ప్రధానమైన పాత్ర చేయనున్నాడని తెలుస్తోంది. ఓ జీవన వేదాన్ని స్క్రీన్ పై ఆవిష్కరించే ప్రయత్నం చేస్తున్నారని అంతా అంటున్నారు. అంటే దీన్ని బట్టి క్రిష్, వెంకటేష్ సినిమా ఆగిపోయినట్లే ననేది సుస్పష్టం మని ఫిల్మ్ సర్కిల్స్ లో వినపడుతోంది. అందులోనూ ఈ మధ్య క్రిష్ ఓ టీవీ సీరియల్ ప్లాన్ చేసి అనుమతి లక్షించిక ఆపుచేసేసారు. అవన్నీ ప్రక్కన పెట్టి ఈ సినిమా హిట్టవ్వాలని కోరుకుందాం.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X