Don't Miss!
- Sports Virat vs Gambhir: గంభీర్ వైపు కోపంగా చూసిన కోహ్లీ! వీడియో
- News జైల్లో చిప్పకూడే.: కేటీఆర్కు సీఎం రేవంత్ రెడ్డి స్ట్రాంగ్ కౌంటర్
- Automobiles గిఫ్ట్ అంటే అబ్బాయిలే ఇవ్వాలా.??.. పెళ్లిలో వరుడికి వధువు అదిరిపోయే బైక్ గిఫ్ట్.. వైరల్ వీడియో చూసేయండి
- Technology 32MP+32MP సెల్ఫీ కెమెరాలతో షియోమీ కొత్త స్మార్ట్ఫోన్.. స్పెసిఫికేషన్లు, ఫీచర్ల వివరాలు..!
- Lifestyle Human Brain Size రోజు రోజుకు పెరుగుతున్న మానవ మెదడు సైజు, రాబోవు కాలంలో బహుషా ఈ వ్యాధులు ఉండవకపోవచ్చు..
- Finance Shapoorji Pallonji IPO: షాపూర్జీ పల్లోంజీ గ్రూప్ నుంచి భారీ ఐపీఓ..
- Travel నహర్ఘర్ కోట దెయ్యాల కోటగా ఎందుకు మారింది? ఈ స్టోరీ తెలిస్తే ఆశ్చర్యపోతారు!
సెకండ్ హీరోయిన్ కాదు...రామ్ చరణ్ కు సిస్టర్ గా
హైదరాబాద్ : శ్రీను వైట్ల దర్శకత్వంలో రామ్ చరణ్ చేయనున్న సినిమా మార్చి 5 లాంచనంగా ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మార్చి 16 నుంచి ప్రారంభం కానుంది. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా చివరి దశకు చేరుకుంటున్నాయి. ఈ సినిమాలో ‘తీన్ మార్', ‘ఒంగోలు గిత్త' సినిమాలో కనిపించిన కన్నడ భామ కృతి కర్భంద ఈ సినిమాలో మరో ముఖ్య పాత్రలో కనిపించనుంది.
ఫేస్బుక్ ద్వారా లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు
తాజా సమాచారం ప్రకారం కృతి కర్బంద చేయనున్న పాత్ర సెకండ్ హీరోయిన్ కాదు. ఆమె రామ్ చరణ్ కి సిస్టర్ గా కనిపించనుంది. శ్రీను వైట్ల - కోన వెంకట్ - గోపి మోహన్ కలిసి ఈ సినిమాని స్క్రిప్ట్ వండుతున్నారు. ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తోంది.
మరోవైపు రామ్ చరణ్ తల్లి పాత్రకి జీవితా రాజశేఖర్ ని పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఈ సినిమా పూర్తి ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ఉంటూనే రామ్ చరణ్ అభిమానులు కోరుకునే యాక్షన్ ఎలిమెంట్స్ కూడా ఉంటాయని సమాచారం. అనిరుధ్ రవిచంద్రన్ మ్యూజిక్ అందించనున్న ఈ సినిమాని అక్టోబర్ 15న రిలీజ్ చెయ్యడానికి ప్లాన్ చేస్తున్నారు.
చిత్రం పూర్తి వివరాల్లోకి వెళితే...
రామ్చరణ్ హీరోగాగా డి.వి.వి.ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై ఓ చిత్రం తెరకెక్కబోతోంది. రకుల్ప్రీత్ సింగ్ హీరోయిన్. శ్రీను వైట్ల దర్శకత్వం వహిస్తున్నారు. డి.వి.వి.దానయ్య నిర్మాత. మార్చి 5న చిత్రాన్ని ప్రారంభిస్తారు. 16 నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలవుతుంది. ఈ విషయాలను ధృవీకరిస్తూ నిర్మాత మీడియాకు ప్రకటన విడుదల చేసారు.
దర్శకుడు మాట్లాడుతూ ''యాక్షన్తో కూడిన కుటుంబ కథా చిత్రమిది. భారీ తారాగణంతో పాటు, అత్యున్నత సాంకేతిక విలువలతో సినిమా తెరకెక్కిస్తాం'' అన్నారు.
నిర్మాత మాట్లాడుతూ ''విజయవంతమైన కలయికలో రూపొందుతున్న ఈ చిత్రం అందరినీ అలరించేలా ఉంటుంది. శ్రీనువైట్ల మూల కథ అందించారు. అక్టోబరు 15న చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాం'' అన్నారు. ఈ సినిమాకు 'కొలవెరి...' ఫేమ్ అనిరుధ్ సంగీతం సమకూరుస్తున్నారు. శ్రీను వైట్ల, రచయితలు కోన వెంకట్, గోపీమోహన్ది విజయవంతమైన కాంబినేషన్ అనీ, ఆ కాంబినేషన్తో ఈ సినిమా రూపొందుతుండటం ఆనందంగా ఉందని నిర్మాత దానయ్య అన్నారు.
ఈ చిత్రానికి కథ: కోన వెంకట్, గోపీమోహన్, మాటలు: కోన వెంకట్, ఛాయాగ్రహణం: మనోజ్ పరమహంస, కూర్పు: ఎ.ఆర్. వర్మ, కళ: నారాయణరెడ్డి, ఫైట్స్: అణల్ అరసు, సమర్పణ: డి. పార్వతి, మూలకథ, స్ర్కీన్ప్లే, దర్శకత్వం: శ్రీను వైట్ల.