Don't Miss!
- News రేవంత్ నన్ను జైల్లో వేస్తాడట..: కాంగ్రెస్ సర్కారుపై కేసీఆర్ నిప్పులు
- Sports DC vs GT: ఆ తప్పిదంతోనే ఓడిపోయాం: శుభ్మన్ గిల్
- Lifestyle పెళ్లైన వ్యక్తితో డేటింగా? కాస్త ముందు..వెనకా ఆలోచించండి..లేదంటే కొంప కొల్లేరే..!
- Technology OPPO Find X7 Ultra కెమెరా రివ్యూ! అద్భుతమైన ఫీచర్లతో, బెస్ట్ కెమెరా ఫోన్!
- Automobiles 323 కి.మీ రేంజ్తో ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్ విడుదల.. ధర తెలిస్తే కొనేందుకు ఆలోచిస్తారు..!!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
రామ్ సరసన పవన్ కళ్యాణ్ హీరోయిన్ ఖరారు
హైదరాబాద్ : పవన్ కళ్యాణ్ సరసన 'తీన్మార్'లో కనిపించిన కృతి కర్బందా గుర్తుండే ఉంటుంది. బోణి తో బోణి కొట్టిన ఈ ముద్దుగుమ్మకి ఎందుకునో బ్రేక్ రాలేదు. ఇప్పుడు తాజాగా ఆమె రామ్ చిత్రంలో బుక్ అయినట్లు సమాచారం. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో ఈమెకు అవకాశం రావటానికి కారణం అంతకుముందు శుభ పుతే అనే కొత్త అమ్మాయిని హీరోయిన్ ని తీసుకుని ఆ తర్వాత తీసేయటమే. గుంటూరు మిర్చి యార్డ్ లో షూటింగ్ చేస్తూంటే ఆమె అనారోగ్యం పాలైంది. ఆ తర్వాత ఆమె ప్లేస్ లోకి మరో హీరోయిన్ ని తీసుకున్నారు. కానీ ఆమె కూడా సెట్ కాలేదు. ఇప్పుడు కృతి ప్రవేశించింది.
కృతి కర్భంభ గతంలో మంచు మనోజ్ సరసన మిస్టర్ నూకయ్య చిత్రం చేసింది. అలాగే తీన్ మార్,బోణీ ఆమెకు పెద్ద పేరు తేలేకపోయాయి. అయితే ఆమె ప్రస్తుతం కళ్యాణ్ రామ్ చేస్తున్న త్రీడి చిత్రంలో హీరోయిన్ గా చేస్తోంది. ఇప్పుడు రామ్ సినిమాకు వచ్చింది. ఈ సినిమాతో అయినా తనకు బ్రేక్ వచ్చి తెలుగు పరిశ్రమలో బిజీ అవుతానని భావిస్తోంది. ఈ చిత్రంలో హీరోయిన్ పాత్రకు మంచి క్యారెక్టరైజేషన్ ఉందని,తద్వారా తనను తాను నిరూపించుకునేందుకువ చేసుకునేందుకు అవకాసం వస్తుందని భావిస్తోంది.
ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్ పై బి.వి.ఎస్.ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్నారు. కొన్ని రోజుల క్రితం ఈచిత్రం షూటింగ్ గుంటూరు మిర్చి యార్డులో జరిగింది. మిరపకాయల ఘాటుకు తట్టుకోలేక హీరోయిన్ శుభ పుతేల అనారోగ్యం పాలైంది. దీంతో వైద్యులు ఆమె రెండు నెలలు రెస్టు తీసుకోమని చెప్పారు. ఈ పరిణామాల నేపథ్యంలో ఆమెకోసం వెయిట్ చేయడం ఇష్టం లేక ఆమె స్థానంలో ఈమె వచ్చింది. రామ్ "ఒంగోలు గిత్త" చిత్రానికి జి.వి.ప్రకాష్ సంగీతాన్నందిస్తున్నారు. రామ్ హీరోగా ఇటీవల వచ్చిన ఏందుకంటే ప్రేమంట సినిమా ఆశించిన విజయాన్ని అందుకోలేక పోయింది. దీంతో ఒంగోలు గిత్త ఏలాగైనా హిట్ అవ్వాలని తీవ్రంగా కృషి చేస్తున్నాడు. సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది.